జియోకు ముందు, జియోకి తరువాత.. దేశం ఎలా తయారైందంటే..
జియో రాక ముందు దేశంలో టెలికం పరిస్థితులు ఎలా ఉన్నాయి. జియో వచ్చిన తరువాత ఎలా ఉన్నాయి
జియో..టెల్కో మార్కెట్లో ఓ సునామి..ఉచిత ఆఫర్లతో దేశం మొత్తాన్ని తన వైపు ఆకర్షించుకున్న దిగ్గజం. మరి జియో రాక ముందు దేశంలో టెలికం పరిస్థితులు ఎలా ఉన్నాయి. జియో వచ్చిన తరువాత ఎలా ఉన్నాయి అనే విషయాలను విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు మనకు తెలుస్తాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

నేటికి ఏడాది
జియో వచ్చి నేటికి ఏడాది. టెలికం మార్కెట్లో జియో సృష్టించిన ప్రభంజనానికి దిగ్గజ టెల్కోలు సైతం భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. డేటా విషయంలో జియోకు ముందు.. జియోకు తర్వాత అని చెప్పుకునే స్థాయికి చేరింది.

2జి సామ్రాజ్యాన్ని
గత పాతికేళ్లలో పాత ఆపరేటర్లంతా కలిసి స్థాపించిన 2జి సామ్రాజ్యాన్ని జియో వచ్చి రావడంతోనే నేల మట్టం చేసింది. 4జీ నెట్ వర్క్ తో ఓ సునామిని క్రియేట్ చేసింది. ఈ సునామికి పట్టిన సమయం 3 ఏళ్లు మాత్రమే.

ఉచిత డేటా వాయిస్ కాల్స్ తో
కాల్స్ ధరలు చుక్కలనంటిన నేపథ్యంలో జియో వచ్చి రావడంతోనే ఉచిత కాల్స్ అంటే ఎలా ఉంటోయో టెల్కోలకు రుచిచూపించింది. ఉచిత డేటా వాయిస్ కాల్స్ తో యూజర్లకు పండగ వాతావరణాన్ని అందించింది.

ఏకంగా 125 కోట్ల జీబీకి
జియో రాకముందు నెలకు 20 కోట్ల జీబీ మాత్రమే భారతీయులు వినియోగించే వారు జియో రాకతో అది ఏకంగా 125 కోట్ల జీబీకి చేరింది.

మొబైల్ డేటా వినియోగంలో
మొబైల్ డేటా వినియోగంలో జియోకు ముందు భారత్ 155వ స్థానంలో ఉండగా.. ఇపుడు నంబర్ 1 స్థానంలో ఉంది. టీవీని చూసే సమయంతో పోలిస్తే అంతకు ఏడు రెట్లు మొబైల్పై భారతీయులు గడుపుతున్నారంటే అదంతా జియో చలవే.

170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను
ప్రపంచంలో ఏ కంపెనీ కూడా 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను సొంతం చేసుకోలేదు. అది జియోకు మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం 13 కోట్ల మందికి జియో తన సేవలందిస్తోంది.

ఒక జీబీ రూ.50 కంటే తక్కువకే
జియో రాకముందు 1జీబీకి రూ.250 నుంచి రూ.4000 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇపుడు ఒక జీబీ రూ.50 కంటే తక్కువకే లభిస్తోంది.

84 రోజులకు రోజూ 1 జీబీ
84 రోజులకు రోజూ 1 జీబీ జియో వినియోగదార్లకియతే 84 రోజులకు రోజూ 1 జీబీ చొప్పున రూ.399కే వస్తోంది. అంటే రూ.50/జీబీ కంటే చాలా తక్కువన్నమాట.


Click it and Unblock the Notifications