Just In
- 53 min ago Lava O2 సేల్ మొదలైంది! లాంచ్ ఆఫర్, ధర వివరాలు.
- 3 hrs ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 4 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
- 6 hrs ago ఈ Motorola ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్! Flipkart డిస్కౌంట్ సేల్ వివరాలు
Don't Miss
- News జనసేనకు మరో సీటు గోవిందా.. ?
- Lifestyle భారతదేశంలో పురాతన కాలం నుండి సత్తా చాటుతున్నఅత్యంత శక్తివంతమైన 7 రాజకీయ కుటుంబాలు..!
- Finance Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సెస్సెక్స్-నిఫ్టీ.. మెరిసిన రియల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్..
- Sports Rohit X Hardik: కొండ మీద నిల్చున్నా పొట్టోడు పొట్టోడే- మాజీ క్రికెటర్
- Movies శ్రీవారి సన్నిధిలో మెగా ప్రిన్స్ క్లింకార తొలి దర్శనం.. రాంచరణ్, ఉపాసన రియాక్షన్ ట్రెండింగ్.. వీడియో
- Automobiles ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ కలిగిన కార్లు - ధర రూ.10 లక్షల కంటే తక్కువే..
- Travel శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఐదు రోజుల ఉగాది మహోత్సవాలు.. ఎప్పుడంటే?!
తగ్గిన స్మార్ట్ఫోన్ల అమ్మకాలు,యూజర్లకు బోర్ కొట్టేసిందా ?
ఇప్పుడు ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ఫోనే కనిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి యువతరం వరకు అందరూ స్మార్ట్ ఫోన్ల ను వినియోగిస్తున్నారు. అయితే ఇంతలా వినియోగం ఉన్నా ఈ ఏడాది జూన్ తో ముగిసిన రెండో త్రైమాసికంలో మాత్రం దేశీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి.
ఈ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 3.3 కోట్ల వరకు ఉన్నట్టు పరిశోధన సంస్థ కానలిస్ వెల్లడించింది. గత ఏడాది జూన్ త్రైమాసికంలో 3.31 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి.
షియోమి నెంబర్ వన్
ఇండియా మార్కెట్లో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల కంపెనీ షియోమీ మరోసారి సత్తా చాటింది. వరుసగా గత ఎనిమిది త్రైమాసికాలుగా ఈ కంపెనీ మార్కెట్ లీడర్ గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 31 శాతం (1.03 కోట్ల ఫోన్లు ) ఉండగా.. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ 73 లక్షల ఫోన్లను విక్రయించగా ఈ కంపెనీ మార్కెట్ వాటా 22 శాతంగా ఉంది. వివో వాటా (58 లక్షలు), ఒప్పో వాటా 9 శాతం (30 లక్షలు), రియల్ మీ 8 శాతం (27 లక్షలు) వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అగ్రస్థాయిలో ఉన్న ఐదు కంపెనీల వాటాయే 88 శాతం వరకు ఉంది. అంతకు ముందు ఏడాది జూన్ త్రైమాసికంలో వీటి వాటా 80 శాతంగా ఉంది.
అంచనాలకన్నా తక్కువ వృద్ధి
దేశీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు సంబంధించి కంపెనీలు ఆశిస్తున్నా స్థాయిలో వృద్ధి నమోదు కావడం లేదు. ఫీచర్ ఫోన్లను వాడుతున్న వారిలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లకు వేగవంతంగా మారిపోవడం లేదు. అయితే కొంత మంది మరింత మెరుగైన ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్లనే ఫోన్ల మార్కెట్లో వృద్ధి నమోదు అవుతోంది. రూ. 15,000 నుంచి రూ. 20,000 మధ్య శ్రేణిలో ఫోన్లను కొనుగోలు చేసే వారు పెరుగుతున్నారు.
4జీ మొబైల్ ఫోన్లు ఎక్కువ
ప్రస్తుతం 4జీ మొబైల్ ఫోన్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో 5 జి సేవలు అందుబాటులోకి రావచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కస్టమర్లు 5 జి ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
చైనా కంపెనీల హవా
ప్రస్తుతం దేశీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీల హవా సాగుతోంది. వీటిలో వివో, ఒప్పో, హానర్, హువాయి, షియోమి, వన్ ప్లస్, లెనోవో,రియల్ మి ఉన్నాయి. మార్కెట్లో వీటి అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్ లైన్ తో పాటు రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకాలను పెంచుకోవడానికి ఈ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.
మార్కెట్లో గట్టి పోటీ
దేశీయంగా మొబైల్ ఫోన్లను చైనా కంపెనీలు తయారు చేయడం తక్కువ ధరలోనే ఈ కంపెనీలు ఫోన్లను అందించగలుగు తున్నాయి. చైనా తదితర కంపెనీల మూలంగా దేశీయ మొబైల్ ఫోన్ల కంపెనీలైన ఐ బాల్, ఇంటెక్స్, కార్బన్ మొబైల్స్, లావా, సెల్ కాన్ వంటి కంపెనీలు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470