భార్య అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రబుద్దుడు
కట్టుకున్న భర్తే భార్య పరువు తీశాడు.భార్య వేరేవాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటుందనే అనుమానం తో ఆమె నగ్న చిత్రాలను తీసి పేస్ బుక్ ద్వారా భార్య కుటుంబ సభ్యులకు పంపాడు.
కట్టుకున్న భర్తే భార్య పరువు తీశాడు.భార్య వేరేవాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటుందనే అనుమానం తో ఆమె నగ్న చిత్రాలను తీసి పేస్ బుక్ ద్వారా భార్య కుటుంబ సభ్యులకు పంపాడు. ఈ ఘటన అబు దాబిలో చోటు చేసుకొంది.విషయం తెలుసుకొన్న భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు Dh250,000 జరిమానా విధించింది.ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే

వేరేవాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటుందని అనుమానం పెంచుకున్నాడు...
ఓ వ్యక్తి తన భార్యతో కలిసి అబు దాబిలో ఉంటున్నాడు.అయితే తన భార్య వేరేవాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటుందని అనుమానం పెంచుకున్నాడు.

నగ్న చిత్రాలను ఫేస్బుక్ మేసేంజర్ ద్వారా...
అయితే తన భార్య కి తెలియకుండాని ఆమె నగ్న చిత్రాలను తీసేవాడు. ఆ నగ్న చిత్రాలను ఫేస్బుక్ మేసేంజర్ ద్వారా భార్య కుటుంబసభ్యులకు పంపాడు.భార్య సోదరుడు,తండ్రి, తల్లికి పేస్ బుక్ మేసేంజర్ ద్వారా షేర్ చేశాడు.

ఫోన్ ను డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు...
జీవితాంతం తోడుంటానని భావించిన భర్తే ఇలా చేయడంతో ఆమె భర్తపై కేసు పెట్టింది. పోలీసులు ఆ ఫోన్ ను సీజ్ చేసి ఫోన్ ను డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.

కోర్టు నిందితుడికి Dh250,000 జరిమానాను విధించింది...
రిపోర్టులు అతను తన ఫోన్ నుండి ఈ చిత్రాలను పంపించాడని ధృవీకరించారు.తను ఈ పని చేసినట్టు నేరాన్ని ఒప్పుకున్నాడు.ఈ విషయమై కోర్టు నిందితుడికి Dh250,000 (సుమారు రూ.50 లక్షలు) జరిమానాను విధించింది.


Click it and Unblock the Notifications








