Just In
- 10 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 17 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 18 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 21 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పాకిస్తాన్కు ముఖేష్ అంబానీ ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా ?
ఇప్పటివరకూ పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించదని సంస్థ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. తక్షణం తమ నిర్ణయం అమలులోకి వచ్చినట్టన
పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డ్ పీసీబీకి భారత ఛానెల్ డీస్పోర్ట్స్ గట్టిషాక్ ఇచ్చింది.ఇదిలా ఉంటే సైనికుల కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా నిరసిస్తూ, పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్)నుంచి తప్పుకోవాలని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఐఎంజీ - రిలయన్స్ నిర్ణయించింది.
పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం
కాగా, పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐఎంజీ - రిలయన్స్ పలు మ్యాచ్ ల లైవ్ కవరేజ్ కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సివుంది. వివిధ దేశాల్లోని టీవీ చానళ్లకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్ లు వంటి ఇతర మౌలిక వసతులను కల్పించాల్సివుంది.
డీ-స్పోర్ట్ చానల్ లో ప్రసారం
ఇండియాలో పీఎస్ఎల్ పోటీలు 2017లో డిస్కవరీ ఛానల్ ప్రారంభించిన డీ-స్పోర్ట్ చానల్ లో ప్రసారం అవుతుంటాయి. ఉగ్రదాడులకు పాల్పడే పాకిస్థాన్ వంటి దేశాలతో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది.
పుల్వామా ఉగ్రదాడి
అలాగే ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉండే సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది.
రిలయన్స్ ఫౌండేషన్
ఆ కుటుంబంలోని పిల్లల చదువులు, వారి ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆ ఫ్యామిలీలు జీవనోపాధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంతటితోనే తాము ఆగిపోబోమని, రిలయన్స్ ఫౌండేషన్ సహకారం ఎక్కడ అవసరం అని ప్రభుత్వం భావిస్తే, తాము అక్కడ సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470