డేటా ఫ్రీగా వచ్చిందని పోర్న్ తెగ చూసేస్తున్నారు, రిపోర్ట్ తెలిపిన నిజాలు
టెలికం సంస్థలు పోటీ పడి మరీ ఉచితంగా లేదా తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇస్తుండటంతో ఇండియాలో నెట్ వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
టెలికం సంస్థలు పోటీ పడి మరీ ఉచితంగా లేదా తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇస్తుండటంతో ఇండియాలో నెట్ వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అబ్బాయిలు, అమ్మాయిలన్న తేడా లేకుండా ఇంటర్నెట్ ప్రపంచానికి బానిసలవుతున్నారు. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది ఆ వీడియోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ సంచలన రిపోర్ట్ బయటకొచ్చింది. డేటా ఫ్రీగా వచ్చిందని చాలామంది మొబైల్లో పోర్న్ వీడియోలు తెగ చూసేస్తున్నారని రిపోర్ట్ చెబుతోంది. కేవలం మహానగరాలలోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ X వీడియోలు చూడటం, పిల్లలు దారి తప్పుతుండటంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని రిపోర్ట్ తెలిపింది.

విడూలీ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం
వీడియో వీక్షకుల ట్రాకర్ విడూలీ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏడాది తొలి మూడు నెలల్లోనే దేశంలో నెటిజన్లు 130 కోట్ల జీబీకి పైగా డేటాను వాడుకున్నారు. ఇది కిందటి ఏడాది జూన్తో పోల్చితే 9 రెట్లు ఎక్కువ. ఆ నివేదిక వివరాలను ప్రముఖ జాతీయ పత్రికలన్నీ ప్రచురించాయి.
(గమనిక: ఈ నివేదికను విడూలి సంస్థ బయటకు ఇవ్వడంలేదు )

కేటగిరీలు చూసేవారి సంఖ్య
ఈ నివేదిక ప్రకారం మ్యూజిక్, ప్రాంతీయ వార్తలు, కామెడీ షోలను చూసేవారూ పెరుగుతున్నారు. ఈ కేటగిరీలు చూసేవారి సంఖ్య 30-40 శాతం పెరిగింది. మొత్తానికి 80 శాతం డేటాను వీడియోల కోసమే వెచ్చిస్తున్నారు.

వారానికి 28 గంటలకు పైగా మొబైల్
ప్రస్తుతం దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వారానికి 28 గంటలకు పైగా మొబైల్ చూస్తున్నారు. ఇది టీవీకన్నా ఏడు రెట్లు ఎక్కువ.అయితే వీరిలో పోర్న్ చూసేవారి సంఖ్య భారీగానే ఉందట..

పోర్న్ చూస్తున్న వారిలో ..
పోర్న్ చూస్తున్న వారిలో మహిళల ప్రపంచ సగటు 26 శాతంగా ఉండగా భారత్లో మరో 4 శాతం ఎక్కువ మందే ఉన్నారు. పోర్న్ హబ్ వెల్లడించిన వివరాల మేరకు.. పోర్న్ వీక్షణలో భారత్ది నాలుగో స్థానం. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రిటన్, కెనడా ఉన్నాయి.

18-24 ఏళ్ల మధ్యవారే..
పోర్న్ చూసేవారిలో ఎక్కువ మంది 18-24 ఏళ్ల మధ్యవారే. వీరి వాటా 48 శాతం మందే ఉన్నారని రిపోర్ట్ తెలిపింది.

తక్కువ ధరకే 4జీ ఇస్తుండటం..
తక్కువ ధరకే 4జీ ఇస్తుండటం నెట్ వినియోగం పెరిగేందుకు కారణమవుతోంది. తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం కూడా దీనికి సాయం చేస్తున్నాయి.

2050కి ఈ సంఖ్య 65 కోట్లకు పైగానే
దేశంలో 2011లో రోజూ 1-1.5 కోట్ల మంది నెట్ చూస్తుండగా 2017 నాటికి ఈ సంఖ్య 30.కోట్లకు చేరింది. ఇది 2050కి ఈ సంఖ్య 65 కోట్లకు పైగానే చేరుతుందని అంచనా. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications