కారు నడుపుతూ ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్లో ఉండగా ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
యూట్యూబ్లో వైరల్ అవుతోన్న వీడియో..
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ వాడకం ప్రమాదకరమని పదేపదే హెచ్చరిస్తున్నప్పటికి చాలా మంది ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం.

డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత లోపిస్తే మన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. తాజాగా శ్రీనగర్లో చోటుచేసుకుంటన్న ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ను వినియోగిస్తూ ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తోన్న అదుపుతప్పి బోల్తా కొట్టటంతో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదు. యూట్యూబ్లో వైరల్ అయిన ఈ వీడియోను మీరు చూడండి..


Click it and Unblock the Notifications








