Home
News

భారతీయ వ్యవసాయ రంగంలో మొదలైన టెక్నాలజీ హవా!!!!

ఇండియాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కేంద్ర బిందువుగా ఉంది. భారతీయ జనాభాలో ఎక్కువ మందికి వ్యవసాయం అనేది జీవనోపాధికి ప్రధాన వనరు అయినప్పటికీ ఇది ఇప్పటికీ సాంకేతిక పరంగా ఇంకా వెనుకబడి ఉంది.

భారతీయ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

భారతీయ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

భారత ఆర్థిక వ్యవస్థకు దీని యొక్క ప్రాముఖ్యత చాలా వరకు ఉన్నప్పటికీ ఈ రంగాన్ని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో నిధులను కేటాయిస్తున్నది. పనిముట్ల నుండి ఫైనాన్సింగ్ వరకు కూడా భారతీయ వ్యవసాయ రంగం అనేక సమస్యలతో బాధపడుతోంది. వ్యవసాయ సామగ్రి సరిపోకపోవడం, సరసమైన ధరలకు విత్తనాలు లేకపోవడం, వ్యవసాయ నుండి ఫోర్క్ మధ్య మధ్యవర్తుల కారణంగా పంపిణీ సవాళ్లు భారత రైతు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు. వ్యవసాయ చక్రంలోని ఈ సవాళ్లన్నింటికీ కేవలం రైతులు మాత్రమే నష్టపోతున్నారు. నాణ్యమైన సాధనాలు, తెగులు వ్యాప్తి నుండి రైతులు ప్రమాదాన్ని తగ్గించకుండా వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కారణంగా వీటి యొక్క వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

వ్యవసాయంలో టెక్నాలజీ పద్ధతులు

వ్యవసాయంలో టెక్నాలజీ పద్ధతులు

ప్రస్తుతం మనం అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న సాంకేతికత ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇతర రంగాలు అప్ డేట్ చెందుతున్న మాదిరిగానే టెక్నాలజీ వ్యవసాయ పద్ధతులను కూడా మెరుగ్గా మారుస్తుంది. నాణ్యత, పరిమాణం, పంపిణీ మరియు నిల్వకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడం ద్వారా టెక్నాలజీ భారతీయ వ్యవసాయాన్ని మార్చగలదు.

వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం

వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం

ఎల్లపుడు రైతులు గత సీజన్ పోకడల ఆధారంగా పంటలను ఎంచుకుంటు ఉంటారు. వాతావరణ పరిస్థితులు , ఎక్కువ డిమాండ్ గల విషయాలు, ధరల యొక్క హెచ్చుతగ్గుల వివరాలను జాగ్రత్తగా విశ్లేషించడానికి ప్రస్తుతం పెరిగిన సాంకేతికత పరిజ్ఞానం వారికి సహాయపడుతుంది. అలాగే ఈ టెక్నాలజీ సరఫరా మరియు డిమాండ్ మధ్య మంచి సమతుల్యతను సృష్టిస్తుంది. టెక్నాలజీ ఎనేబుల్డ్ ఫార్మింగ్ టూల్స్ అనేది చిన్న చిన్న పొలాలకు ఒక వరంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలో ఉపయోగించే పెద్ద యంత్రాలు మన చిన్న పొలాలలో ఉపయోగించడానికి సరిపోవు. చిన్న పొలాలకు అనువైన యాంత్రికరణలను ఉపయోగించడం ముఖ్యమైన భాగం. ఇది మాన్యువల్ ప్రయత్నంపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేయడానికి కూడా ప్రేరిపిస్తాయి.

ఇండియాలో వ్యవసాయ సాంకేతిక నిపుణులు

ఇండియాలో వ్యవసాయ సాంకేతిక నిపుణులు

ఇండియాలో వ్యవసాయ సంక్షోభంను తగ్గించడానికి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన నిపుణులు అధికంగా కృషి చేస్తున్నారు. వ్యవసాయంలో గరిష్ట జీవనోపాధి గల మన దేశంలో ప్రభుత్వ విధానాలు మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో గొప్ప ఫలితాలను అందుకుంటున్నాయి. అంతర్గత డిమాండ్లలో స్థిరమైన పెరుగుదల ఉన్నప్పటికీ వ్యవసాయ ఎగుమతులు 2019 లో 38.54 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే 2020 లో వ్యవసాయంలో సరికొత్త టెక్నాలజీ మరింత మార్పులను తీసుకురావాలని చూస్తున్నది.

 

భారతదేశంలోని వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీలు

భారతదేశంలోని వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీలు

Artificial Intelligence


వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి మరియు మంచి దిగుబడిని సాధించడానికి ఆ పంటకు తగ్గ స్థలాన్ని గుర్తించడం చాలా అవసరం. AI టూల్స్ వ్యవసాయ రంగంలోకి ప్రవేశించడంతో వాతావరణ పరిస్థితులు, పంటకు అవసరమైన పంట రకం, అత్యంత అనుకూలమైన నేల రకం మొదలైనవాటి యొక్క సమాచార ఆధారిత డేటాను పొందడం సాధ్యమవుతుంది.

 

వ్యవసాయ రంగంలో మొబైల్ అప్లికేషన్స్

వ్యవసాయ రంగంలో మొబైల్ అప్లికేషన్స్

స్మార్ట్‌ఫోన్‌లు భారతీయులకు తక్కువ ధరలో కూడా దొరుకుతున్న కారణంగా అందరు డిజిటలైజేషన్ పరంగా అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్ అనుభవం పెరుగుతున్నందున ఎక్కువ కార్యకలాపాలు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పూర్తిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కొత్త మొబైల్ అప్లికేషన్స్ సాంకేతికత వ్యవసాయ రంగంలో కూడా ప్రయోజనాల సామర్థ్యాన్ని పెంచింది.

వ్యవసాయ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్

వ్యవసాయ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్

వ్యవసాయ వస్తువుల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ అయిన ఇ-నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) తో వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని సమర్థించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. రైతులకు ప్రయోజనం చేకూర్చే కొన్ని రాష్ట్రాలు వ్యక్తిగత కార్యక్రమాలు చేపట్టాయి. పంజాబ్ ప్రభుత్వం ‘పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (PRSC) ను ప్రవేశపెట్టింది. వీటితో పాటుగా ఐ-ఖెట్ మెషిన్, ఇ-పెహాల్ మరియు ఇ-ప్రివెంట్ వంటి మరో అప్లికేషన్లు కూడా ఉన్నాయి.

వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ఉపయోగం

వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ఉపయోగం

వ్యవసాయ రంగంలో డ్రోన్స్ యొక్క పనితీరు విషయానికి వస్తే ఇది పంటల యొక్క అన్ని రకాల డేటాను సేకరిస్తుంది. ఇవి ఖచ్చితమైన లేదా స్మార్ట్ వ్యవసాయం కోసం అవసరమైన ఖచ్చితమైన సమాచారంను అందిస్తుంది. సరైన సెన్సార్లను ఉపయోగించడం ద్వారా డ్రోన్లు రైతులకు వారు ఎంచుకోవలసిన పంటలు, నేల క్షీణత, పొడి ప్రాంతాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ మొదలైన వాటికి సంబంధించిన నిజమైన సమాచారాన్ని అందించగలవు. అలాగే ఈ డ్రోన్లను ఉపయోగించి పంటపొలాలపై మందులను పిచికారీ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయ పనిముట్లు ఆన్ లైన్ లో

వ్యవసాయ పనిముట్లు ఆన్ లైన్ లో

ఇండియాలో ఎక్కువ మంది రైతులు తక్కువ మొత్తంలో పొలాలను కలిగి ఉన్నారు. కావున వారు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి పెద్ద పెద్ద టెక్నాలజీ వాహనాలను కొనలేరు. కానీ అవి అద్దెకు దొరుకుతున్నందున వాటి యొక్క అవసరం సమయంలో వాటిని ఉపయోగించవచ్చు. కలుపు తీయడం విత్తనాలను నాటడం వంటి వాటికి చిన్న చిన్న పనిముట్లను అందుబాటు ధరలో లభిస్తున్నాయి. కావున వాటిని ఆన్ లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు వాటిని ప్రభుత్వం రాయితీ ధరల వద్ద కూడా రైతులకు అందిస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇండియా మార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

భారత ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఆఫర్లు

భారత ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఆఫర్లు

ఇండియాలో వ్యవసాయం మీద ఆధారపడే పడే వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. వ్యయసాయ యంత్రాలను కొనుగోలు చేయడానికి లోన్ లను కూడా అందిస్తున్నాయి. అలాగే వాటిని సబ్సిడీ ధరలకు కూడా అందిస్తున్నాయి. కొత్తగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా అందించడం మొదలు పెట్టింది. ఇప్పుడు తెలంగాణమరియు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను పొందవచ్చు. వీటి ద్వారా ప్రతి ఒక్క రైతు సుమారు మూడు లక్షల వరకు రుణ మొత్తాన్ని పొందవచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డులు

కిసాన్ క్రెడిట్ కార్డులు

కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ప్రభుత్వ పథకం. దీని ద్వారా రైతులు రాయితీ రేటుకు రుణాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. సాధారణంగా కొన్ని రంగాలలో మనీలెండర్లు వసూలు చేసే అధిక రేట్ల నుండి రైతులను కాపాడడానికి ప్రభుతం రూపొందించిన గొప్ప పథకం ఇది. ఈ పథకం కింద రైతులు రెండు శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలను పొందవచ్చు. అంతేకాకుండా లబ్ధిదారులు వారు తీసుకున్న మొత్తాన్ని పంట యొక్క కోత లేదా మార్కెటింగ్ వ్యవధిపై ఆధారపడి తిరిగి చెల్లించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అనుమతిస్తుంది. దీని కింద రైతులకు పంట బీమా పథకాన్ని కూడా ఇస్తారు.

కిసాన్ క్రెడిట్ కార్డును పొందడం ఎలా?

కిసాన్ క్రెడిట్ కార్డును పొందడం ఎలా?

*** ప్రసుతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కిసాన్ క్రెడిట్ కార్డును పొందటానికి దరఖాస్తుదారుడు మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ యొక్క వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో ఈ కార్డుకు సంబందించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి అందులో మీ వివరాలను ఫిల్ చేయాలి.

** తరువాత దరఖాస్తుదారుడు తన గుర్తింపు కార్డులలో పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు యొక్క కాపీ పత్రాలను దరఖాస్తు ఫారమ్‌తో కలిపి మీకు సమీపంలో గల బ్యాంకు వద్ద సమర్పించాలి. MNREGA జారీ చేసిన జాబ్ కార్డ్ మరియు ఓటరు యొక్క ID కార్డ్ ను జతచేయవచ్చు. అలాగే చిరునామా రుజువు కోసం రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మరియు ఇంటి యొక్క గత మూడు నెలల యుటిలిటీ బిల్లులు కూడా సమర్పించవలసి ఉంటుంది.

*** రుణ అధికారి రుణ మొత్తాన్ని మంజూరు చేసిన తర్వాత కిసాన్ కార్డు దరఖాస్తుదారుడి చిరునామాకు పోస్టల్ ద్వారా పంపబడుతుంది. ఆ తరువాత కార్డుదారులందరూ తమ కార్డు యొక్క క్రెడిట్ పరిమితికి అనుగుణంగా మీకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు తీసుకున్న క్రెడిట్ మొత్తానికి మాత్రమే ప్రభుత్వం వడ్డీని వసూలు చేస్తుంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Indian Agriculture System Going to use Advanced Technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X