ఇండియా మార్కెట్ని కమ్మేసిన చైనా
ఇండియాలో రోజురోజుకు స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచదేశాల కంపెనీ చూపు ఇండియా మొబైల్ మార్కెట్ మీద పడింది.
ఇండియాలో రోజురోజుకు స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచదేశాల కంపెనీ చూపు ఇండియా మొబైల్ మార్కెట్ మీద పడింది. ఇందులో భాగంగా అన్ని దేశాల కంపెనీ దిగ్గజాలు ఇండియా మార్కెట్లో తమ ఉత్పత్తులను దించి వేశాయి. అమెరికా, దక్షిణ కొరియా, చైనా కంపెనీలు అయితే అన్ని రకాల ఉత్పత్తులతో దేశీయ కంపెనీలకు అతిపెద్ద సవాల్గా మారాయి. ముఖ్యంగా చైనా కంపెనీలు అయితే భారత మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమించాచాయి. వేల కోట్ల రూపాయల కొనుగోళ్లతో తమ దేశానికి ఆదాయాన్ని తీసుకెళుతూ ఇండియా మార్కెట్ ని శాసిస్తున్నాయి.

చైనా సంస్థలు తయారు చేసిన స్మార్ట్ఫోన్లకు...
చైనా సంస్థలు తయారు చేసిన స్మార్ట్ఫోన్లకు భారతీయుల ఆదరణ రోజు రోజుకు పెరుగుతోందే తప్ప తరగడంలేదు. తాజాగా భారతీయ వినియోగదారులు వేలకోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు.

సరసమైన ధరల్లో....
ముఖ్యంగా అద్భుత ఫీచర్లు, సరసమైన ధరల్లో చైనా ఉత్పత్తి సంస్థలు వినియోగదారులను కట్టిపడేస్తుండటంతో ఈ ధోరణి మరింత పెరుగుతోంది. ఆకర్షణీయమైన ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఇబ్బడిముబ్బడిగా లాభాలను సొంతం చేసుకుంటున్నాయి.

50వేలకోట్లను చైనా స్మార్ట్ఫోన్లపై వెచ్చించారు...
2018 ఆర్థిక సంవత్సరంలో 50వేలకోట్లను చైనా స్మార్ట్ఫోన్లపై వెచ్చించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజాలు షావోమి, ఒప్పో, వివో, హానర్ కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి.

లెనోవో, మోటరోలా కంపెనీలు....
వీటితో పాటు లెనోవో, మోటరోలా, వన్ప్లస్, ఇనిఫినిక్స్ లాంటి కంపెనీలు భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ విక్రయాల్లో సగానికిపైగా వాటాను కొల్లగొట్టాయి.

చైనా బ్రాండ్లస్మార్ట్ఫోన్లకు దేశీయంగా డిమాండ్....
అలాగే ప్రస్తుత గణాంకాల ప్రకారం చైనా బ్రాండ్లస్మార్ట్ఫోన్లకు దేశీయంగా డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న ధోరణి కనిపిస్తోందని ఎనలిస్టులు, పరిశ్రమ ప్రతినిధులు విశ్లేషించారు.

ముఖ్యంగా షియోమి కంపెనీ....
ముఖ్యంగా షియోమి కంపెనీ అయితే ఫ్లాష్ సేల్ పేరుతో ప్రత్యర్థులకు సవాల్ మీద సవాల్ విసురుతోంది. రూపాయికే మొబైల్ అంటూ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ప్రముఖ నగరాల్లో ఏకంగా షోరూంలనే తెరిచింది...
దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఏకంగా షోరూంలనే తెరిచింది. దీంతో పాటు ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్ అమెజాన్ లాంటి సంస్థలతో టైఅప్ అయి దేశీయ కంపెనీలకు పెనుసవాల్ విసురుతోంది. దేశీయ కంపెనీలను సంక్షోభంలో పడేలా చేస్తోంది.


Click it and Unblock the Notifications








