Home
News

35 YouTube చానెళ్లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం ! కారణం తెలిస్తే షాక్ అవుతారు

By Maheswara

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెల్‌లు, 2 వెబ్‌సైట్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ యూట్యూబ్ ఛానెల్‌లు పాకిస్థాన్ ప్రాయోజిత ఛానెల్‌లు అనే ఆందోళనలు కూడా ఉన్నాయి. దేశ వ్యతిరేక వార్తలను ప్రచారం చేసేందుకు డిజిటల్ మీడియా ద్వారా ఈ నకిలీ ఖాతాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం కనుక్కొంది . ఈ యూట్యూబ్ ఛానెల్‌లకు 1 కోటి 20 లక్షలు కు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.

యూట్యూబ్‌లో ఫేక్ ఛానెళ్ల దోపిడీ

యూట్యూబ్‌లో ఫేక్ ఛానెళ్ల దోపిడీ

అవును, ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ఫేక్ ఛానెళ్ల దోపిడీ ఎక్కువైంది. ఫేక్ ఐడీ ద్వారా పుట్టుకొచ్చిన ఈ ఛానెల్‌లు భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను ప్రసారం చేయడంలో బిజీగా ఉన్నాయి. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అటువంటి నకిలీ యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసింది. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌లోని వీడియోలకు 130 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంతకీ ఈ ఛానెల్స్‌ని భారత ప్రభుత్వం ఎందుకు బ్లాక్ చేస్తుందో తెలుసుకోవడానికి ముఖ్యమైన ఈ కథనాన్ని చదవండి.

భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలను

భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలను

భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న నకిలీ యూట్యూబ్ ఛానెల్‌లను సెంట్రల్ గవెర్నమెంట్ బ్లాక్ చేసింది. ఈ యూట్యూబ్ ఛానెల్‌లు పాకిస్థాన్ లో పుట్టినవి అని పరిశోధన లో తెలిసింది . సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పుడు 35 యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెల్‌లు మరియు 2 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. మంత్రిత్వ శాఖ ద్వారా బ్లాక్ చేయబడిన YouTube ఖాతాల మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ 1 కోటి 20 లక్షలుకు పైగా  ఉంది మరియు దాని వీడియోలకు 130 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి.భారత్‌ పై వ్యతిరేక వార్తలు వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్న, రెండు ట్విటర్ ఖాతాలు, రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్ ఖాతాలను భారత్ కూడా బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఛానెల్‌లలో, భారత సైన్యం మరియు భారతదేశ విదేశాంగ విధానం గురించి తప్పుడు పుకార్లు కనుగొనబడ్డాయి. ఈ సోషల్ మీడియా ఖాతాలు మరియు వెబ్‌సైట్‌లను భారత నిఘా సంస్థలు నిశితంగా పరిశీలించాయని మరియు వాటిని మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశాయని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వం ప్రకటన ప్రకారం

ప్రభుత్వం ప్రకటన ప్రకారం

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ నిషేధిత ఖాతాల యొక్క ప్రధాన ఉద్దేశ్యం వ్యవస్థీకృత పద్ధతిలో భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం. ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు యువతను ప్రోత్సహించడమే. మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై తప్పుడు వదంతులు ప్రచారం చేస్తూ దేశంలోని యువతకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కు అనుకూలంగా ఈ ఛానెల్స్ పని చేశాయి. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లను పాకిస్థాన్ టీవీ న్యూస్ ఛానెల్‌ల యాంకర్లు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం వివరించింది.అంతేకాకుండా, ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో దేశ వ్యతిరేక వార్తలను వ్యాప్తి చేయడంలో ఈ ఛానెల్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కేందుకే ఈ యూట్యూబ్ ఛానెల్‌లు పోస్ట్‌లు చేయడం ప్రారంభించాయని ప్రభుత్వం పేర్కొంది. అదే కారణంగా, ఈ YouTube ఛానెల్‌లు 2021 IT నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వం ద్వారా బ్లాక్ చేయబడ్డాయి.

YouTube ఛానెల్‌ల నెట్‌వర్క్

YouTube ఛానెల్‌ల నెట్‌వర్క్

ప్రస్తుతం పాకిస్తాన్ నుండి భారత ప్రభుత్వం నిషేధించిన 35 యూట్యూబ్ ఖాతాలు ఉన్నాయి. అవి నాలుగు వ్యవస్థీకృత తప్పుడు సమాచార నెట్‌వర్క్‌లలో భాగమని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అప్నీ దునియా నెట్‌వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌లను మరియు తల్హా ఫిల్మ్స్ నెట్‌వర్క్ 13 యూట్యూబ్ ఛానెల్‌లను నిర్వహిస్తోంది. నాలుగు సెట్‌ల ఛానెల్‌లు మరియు ఇతర రెండు ఛానెల్‌లు సింక్రొనైజేషన్ మోడ్‌లో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి అని వివరించింది.

Best Mobiles in India

English summary
Indian Government Blocks 35 Pakistan Based YouTube Channels, Who Are Spreading Fake News.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X