Home
News

కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను ప్రవేశపెట్టేదిశగా ప్రభుత్వం అడుగులు...

సోషల్ మీడియాను జవాబుదారీగా ఉండేలా నిబంధనలు ఉండాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో ఇటీవల జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సోషల్ మీడియాపై లోక్‌సభ మరియు రాజ్యసభలు ఏకాభిప్రాయం సాధించగలిగితే కనుక దానిని నియంత్రించేందుకు ప్రభుత్వం 'కఠినమైన' మార్గదర్శకాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విపులంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కమ్యూనిటీకి

ముస్లిం కమ్యూనిటీకి చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకున్న ‘బుల్లిబాయి' వంటి వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా తీసుకున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ శర్మ లేవనెత్తిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘బుల్లిబాయి' సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని ఐటీ మంత్రి తెలిపారు. వాక్ స్వాతంత్య్రాన్ని పరిమితం చేసేలా సోషల్ మీడియాను జవాబుదారీగా చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జవాబుదారీగా

మహిళలకు మరియు భవిష్యత్తు తరాలకు మెరుగైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నందున వారిని జవాబుదారీగా ఉంచడానికి కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీ వైష్ణవ్ రాజ్యసభలో తెలిపారు. ఆన్‌లైన్‌లో మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రాథమిక కర్తవ్యం కావున అందులో ఎలాంటి రాజీ పడకూడదని మంత్రి అన్నారు.

సోషల్ మీడియాను నియంత్రించేందుకు రాజ్యాంగబద్ధమైన ఫ్రేమ్‌వర్క్

సోషల్ మీడియాను నియంత్రించేందుకు రాజ్యాంగబద్ధమైన ఫ్రేమ్‌వర్క్

ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పని చేస్తోందని. ఇందులో రాష్ట్రాలు మరియు కేంద్రం యొక్క ప్రభుత్వాలు తమ యొక్క పాత్రను దృష్టిలో పెట్టుకుని చూడాలని సూచించారు. కొన్ని ఏజెన్సీలు అందించిన సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాల చట్ట అమలులో అధికారులు పనిచేస్తారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే ఏదైనా సైబర్ క్రైమ్ కోసం ఒక నిర్మాణం ఉందని దానిని సెంట్రల్ పోర్టల్ ద్వారా నివేదించవచ్చు మరియు తగిన చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి ఫార్వార్డ్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

రూల్స్

సోషల్ మీడియా అనేది ప్రపంచం మొత్తంగా సర్వవ్యాప్తి చెందడమే కాకుండా ఈరోజు మన జీవితాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం సమగ్రమైన మధ్యవర్తిత్వ చట్టాలు మరియు ప్రమాణాలను ప్రవేశపెడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం 2000 ప్రకారం Twitter మరియు Facebook వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మధ్యవర్తులుగా అర్హత పొందుతాయి. భారతదేశంలోని ఇంటర్నెట్‌ను వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకొనివచ్చి సురక్షితంగా మరియు నమ్మదగినదిగా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ మేరకు ఇంటర్నెట్ సురక్షితంగా మరియు విశ్వసనీయంగా ఉండేలా చూసేందుకుగాను ప్రభుత్వం ఫిబ్రవరి 25, 2021న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌లు) రూల్స్ 2021ని జారీ చేసింది. అవసరాలకు అనుగుణంగా సోషల్ మీడియా మధ్యవర్తులు అదనంగా మరింత శ్రద్ధ వహించాలి.

Best Mobiles in India

English summary
Indian Government Steps in to Introduce Stricter Social Media Regulations: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X