దిమ్మ తిరిగే ‘ఫిగర్’

ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి 5 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయని సైబర్మీడియా రీసెర్చ్ ఇండియా మంత్లీ మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ రివ్యూ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 9.1% వృద్ధి సాధ్యమైందని ఈ అధ్యయనం పేర్కొంది. దీని ప్రకారం... 23% మార్కెట్ వాటాతో మొదటి స్థానాన్ని నోకియా నిలుపుకుంది. 14% మార్కెట్ వాటాతో శామ్సంగ్ రెండో స్థానంలో, 5.8% మార్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ 3వ స్థానంలో ఉన్నాయి. మొత్తం 27 లక్షల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ కేటగిరిలో 40% మార్కెట్ వాటాతో శామ్సంగ్ టాప్లో నిలిచింది. 26% మార్కెట్ వాటాతో నోకియా, 12% వాటాతో రిమ్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


Click it and Unblock the Notifications








