Home
News

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఛార్జీల వివరాలు, రైళ్ల రాకపోకల్లో మార్పులు తెలుసుకోండి

IRCTC (Indian Railway Catering and Tourism Corporation) ఈ మధ్య టికెట్ క్యాన్సిలేషన్ సిస్టంను ఐఆర్‌సీటీసీ అఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath Aiah

IRCTC (Indian Railway Catering and Tourism Corporation) ఈ మధ్య టికెట్ క్యాన్సిలేషన్ సిస్టంను ఐఆర్‌సీటీసీ అఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. irctc.co.in ద్వారా కాని మొబైల్ యాప్ ద్వారా కాని మీరు క్యాన్సిల్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. మీరు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్న తరువాత irctc రూల్స్ ప్రకారం మీరు క్లెయిమ్ చేసుకుంటే మీ టికెట్ మొత్తాన్ని రీఫండ్ చేయడం జరుగుతుంది. మీ అమౌంట్ కట్ అయిన అకౌంట్లోనే ఆ మొత్తం జమ అవుతుందని irctc తెలిపింది. ఆఫ్ లైన్ టికెట్లు అయితే PRS (Passenger Reservation System) ద్వారా క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంత మొత్తం మీకు రీఫండ్ అవుతుందనే విషయాలను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

48 గంటల ముందు

48 గంటల ముందు

48 గంటల ముందు మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే IRCTC మీ టికెట్ మొత్తంలో నుంచి రూ. 240ను ఛార్జీల కింద వసూలు చేస్తుంది. AC first class, executive class టికెట్లకు ఈ ఛార్జీ వర్తిస్తుంది.

క్యాన్సిలేషన్ ఛార్జీల వివరాలు

క్యాన్సిలేషన్ ఛార్జీల వివరాలు

AC 2 tier/first class టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే రూ.200, AC 3 tier/AC chair car/ AC 3 Economyలకు అయితే రూ.180, sleeper classకు అయితే రూ.120, second classకు అయితే రూ.60 క్యాన్సిలేషన్ ఛార్జీల కింద వసూలు చేయడం జరుగుతుందని IRCTC తెలిపింది.

ట్రైన్ బయలుదేరే 48 గంటల ముందు

ట్రైన్ బయలుదేరే 48 గంటల ముందు

ట్రైన్ బయలుదేరే 48 గంటల ముందు కాని 12 గంటల పైన కాని టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ మొత్తంలో 25 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీల కింద వసూలు చేస్తారు.

ట్రైన్ బయలుదేరే 12 గంటల ముందు

ట్రైన్ బయలుదేరే 12 గంటల ముందు

ట్రైన్ బయలుదేరే 12 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ మొత్తంలో 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీల కింద వసూలు చేస్తారు.

ప్యాసింజర్ ని బట్టి

ప్యాసింజర్ ని బట్టి

ఈ టికెట్ల మొత్తం ప్యాసింజర్ ని బట్టి, అతను బుక్ చేసుకున్న టికెట్లను బట్టి మారుతుంటాయని IRCTC తెలిపింది.

ఉచిత బీమా సౌకర్యం రద్దు

ఉచిత బీమా సౌకర్యం రద్దు

ఇదిలా ఉంటే రైలు ప్రయాణీకులకు రైల్వేశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటిసి) ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు అందించే ఉచిత బీమా సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఉచిత బీమాను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం చేపట్టిన ఉచిత బీమా సౌకర్యాన్ని త్వరలో నిలిపివేస్తున్నట్టు తాజా ప్రకటనలో తెలిపింది.

బీమా ఐచ్ఛికం

బీమా ఐచ్ఛికం

రైల్వేలు సెప్టెంబర్ 1నుంచి ప్రయాణీకులకు ఉచితంగా ప్రయాణ బీమాను నిలిపివేయనుందనీ.. 'బీమా ఐచ్ఛికం' అని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ..

వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ..

రైల్వే ప్రయాణికులు వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకుంటే ఇన్సూరెన్స్‌ కావాలా వద్దా అనే రెండు ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

న్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం ..

న్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం ..

అయితే ఇన్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం స్పష్టం చేయలేదు.

2017 డిసెంబరు నుంచి..

2017 డిసెంబరు నుంచి..

కాగా, 2017 డిసెంబరు నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఐఆర్సిటిసి ద్వారా రైల్వేశాఖ ఈ ఉచిత బీమాను తీసుకొచ్చింది.

బీమా వివరాలు

బీమా వివరాలు

రైలు ప్రయాణం సమయంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు గరిష్టంగా 10 లక్షల రూపాయలు, వికలాంగుడయితే 7.5 లక్షల రూపాయలు, గాయపడినట్లయితే రూ. 2 లక్షలు అందిస్తోంది. అలాగే మృతదేహాలను తరలించేందుకు రూ. 10వేలు కూడా అందిస్తుంది.

 రాకపోకల సమయాల్లో మార్పులు

రాకపోకల సమయాల్లో మార్పులు

దీంతో పాటుగా పలు రైళ్ల రాకపోకల సమయాల్లో భారత రైల్వే మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త సమయ పట్టిక ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

301 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు

301 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు

మొత్తం 301 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కువగా ఉత్తరాదిలో నడిచే రైళ్ల సమయ పట్టికలో ఈ మార్పులు చేశారు. ఈ రైళ్ల రాకపోకల సమయాల్లో చేసిన మార్పు..ఐదు నిమిషాల నుంచి రెండున్నర గంటల పాటు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కొత్త సమయ పట్టిక మేరకు

కొత్త సమయ పట్టిక మేరకు

కొత్త సమయ పట్టిక మేరకు 57 రైళ్లు బయలుదేరే సమయాన్ని మునుపటి కంటే ముందుకు జరపగా...58 రైళ్లు మునుపటి కంటే ఆలస్యంగా బయలుదేరి వెళ్లనున్నాయి.

కొత్త సమయ పట్టిక మేరకు

కొత్త సమయ పట్టిక మేరకు

అలాగే 102 రైళ్లు మునుపటి కంటే ముందే గమ్య స్థానాలకు చేరుకోనుండగా...84 రైళ్లు మునుపటి కంటే ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుకుంటాయి.

రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు

రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు

ఇప్పటికే టికెట్లను రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు...ఈ రాకపోకల సమయాల్లో మార్పులకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

రైళ్ల జాబితాలో ..

రైళ్ల జాబితాలో ..

రాకపోకలు మార్పులు చేసిన రైళ్ల జాబితాలో అమృతసర్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, తేజాస్ ఎక్స్‌ప్రెస్, హంసఫర్ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇవి మునుపటి సమయం కంటే ఐదు నిమిషాలు ముందే బయలుదేరి వెళ్లనున్నాయి.

రైళ్ల జాబితాలో..

రైళ్ల జాబితాలో..

అలాగే డెహ్రాడూన్-అమృతసర్, హంసఫర్ ఎక్స్‌ప్రెస్, జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు మునుపటి సమయం కంటే ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుకుంటాయి.

Best Mobiles in India

English summary
IRCTC Rules: Here's How Much Indian Railways Charges For Cancellation Of Confirmed Ticket more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X