ఫేస్బుక్ పోస్ట్ 26 మందికి మాత్రమే పరిమితమా ? షాక్ న్యూసే ఇది !
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్స్టంట్ దిగ్గజం ఫేస్బుక్ పై సోషల్ మీడియాలో అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్స్టంట్ దిగ్గజం ఫేస్బుక్ పై సోషల్ మీడియాలో అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇకపై మీరు చేసే పోస్ట్ ని కేవలం 26 మంది స్నేహితులు మాత్రమే చూసే విధంగా లిమిటెడ్ ఆప్సన్ ని ఫేస్ బుక్ ప్రవేశపెట్టనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమేనా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది అబద్దమని తెలుస్తోంది.మీరు పెట్టే పోస్టులు కేవలం 26 మందికి మాత్రమే చేరే విధంగా వస్తున్న వార్తలు కరెక్ట్ కాదు. ఇలా మెసేజ్ వస్తే అది నమ్మవద్దు అని నిపుణులు చెబుతున్నారు.దీనిపై ఫేస్బుక్ కూడా ఓ పోస్టును విడుదల చేసినట్లు సమాచారం.

ఫేస్ బుక్ న్యూ ఆల్గారిధమ్
ఫేస్ బుక్ లో ఎవరైనా పోస్ట్ చేస్తే అది కేవలం 25 నుంచి 26 మందికి మాత్రమే చేరుతుందంటూ కొందరికి మెసేజ్ ఫేస్ బుక్ న్యూ ఆల్గారిధమ్ లో భాగంగా ఇది జరుగుతోందని కాబట్టి సెలక్ట్ చేసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు.

కాఫీ పేస్ట్
ఇదిలా ఉంటే ఇంకో రూమర్ కూడా చక్కర్లు కొడుతోంది. యూజర్లు పోస్టును కాపీ ఫేస్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అడగాలని అటువంటి ఫీచర్ త్వరలో వస్తుందనే రూమర్ వినిపిస్తోంది. ఇది కూడా ఒట్టి పుకారేనని తేలింది. అయితే ఇది మాత్రం వైరల్ అవుతోంది.

ఫేస్బుక్ మిమి
కాగా జుకర్ బర్గ్ తో ఉన్న ఈ మిమి అనేక ఆర్గనైజేషన్లకు ప్రమోట్ అవుతోంది. వాషింగ్టన్ పోస్ట్ కూడా దీనిని నిజమని నమ్ముంతోంది. అలాగే అందర్నీ ఒప్పిస్తోందని ఫేస్ బుక్ చెబుతోంది. అయితే ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని మేము అలాంటి ఫీచర్ ను తీసుకురావడం లేదని తేల్చి చెప్పింది.

యూజర్లలో విపరీతమైన గందరగోళం
ఏదైమైనా ఇలాంటి వాస్తవాల ద్వారా యూజర్లలో విపరీతమైన గందరగోళం నెలకొని ఉంది. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజనిజాలను నిర్థారించుకోవాలని పలువురు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications








