Just In
- 53 min ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- 2 hrs ago 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- 3 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- 4 hrs ago ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
Don't Miss
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
ఐటీలో 85 వేల ఉద్యోగాల నియామకం,మరిన్ని ఉద్యోగాలకు సై
భవిష్యత్తులో రానున్న ప్రాజెక్టుల కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ కొత్తగా దాదాపు 85 వేల మందిని నియమించుకుంది.గత ఆరేళ్లలో ఒక త్రైమాసికంలో కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఈ స్థాయిలో ఉండడం రికార్డు అని ఈక్విటీ రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ తెలిపింది.
హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడంతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఆయా దేశాల్లోనే కంపెనీలు ఆ దేశాలకు చెందిన నిపుణులను తీసుకుంటున్నాయి. దీంతో భారీ మొత్తంలో కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
మరింత మంది ఉద్యోగులు అవసరం
భవిష్యత్తులో రానున్న ప్రాజెక్టుల వల్ల మరింత మంది ఉద్యోగులు అవసరమవుతారని.. అందుకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలనే ఉద్దేశంలో ఐటీ కంపెనీలు నిపుణులను నియమించుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హెచ్1 బీ వీసా నిబంధనలు కఠినం కావడంతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఆయా దేశాల్లోనే కంపెనీలు నిపుణులను నియమిస్తున్నాయి. ఈ నియామకాలకు ఇక్కడ చేపట్టిన నియామకాలు కన్నా అదనం.
టీసీఎస్ 12,356 మందికి ఉద్యోగాలు
2012-13 తొలి త్రైమాసికంలో పరిశ్రమ కొత్తగా దాదాపు 50 వేల మంది నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చిందని సీఎల్ఎ్సఏ వెల్లడించింది. 2013-14 చివరి త్రైమాసికానికి ఇది దాదాపు 38 వేలకు తగ్గింది. 2015-16 తొలి త్రైమాసికంలో 70 వేల మంది స్థాయికి చేరింది. ఆ తర్వాత 2017-18 తొలి త్రైమాసికంలో 10 వేల మందికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ 12,356 మందికి ఉద్యోగాలు ఇచ్చింది.
సమీప భవిష్యత్తులో కూడా ఇదే జోరు
గత అయిదేళ్లలో ఒక త్రైమాసికంలో కంపెనీ ఇచ్చిన అత్యధిక ఉద్యోగాలు ఇవేనని రీసెర్చ్ సంస్థ తెలిపింది . 30,000 మందికి పైగా ఫ్రెషర్లకు జాయినింగ్ లెటర్లు ఇచ్చామని.. ఇందులో తొలి త్రైమాసికంలో 40 శాతం మంది కంపెనీలో చేరారని టీసీఎస్ వెల్లడించింది. అదే విధంగా తొలి త్రైమాసికంలో విప్రో 3,425 మంది నిపుణులను తీసుకుంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ 5,935 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది.
ఇన్ఫోసిస్
ఇదిలా ఉంటే తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ.. బయటకు వెళ్లిన వారిని పరిగణనలోకి తీసుకుంటే.. నికరంగా ఇచ్చిన ఉద్యోగాలు 908 మాత్రమే. డిజిటల్ టెక్నాలజీల్లో నైపుణ్యాలున్న వారిని ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470