రూ.500 కంటే తక్కువ ధరలో 1.5GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్లు..!
జియో ప్రస్తుతం భారత్ టెలికాం విభాగంలో తొలి స్థానంలో ఉంది. సుమారు 50 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. అయితే ఇటీవలే జియో రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. దీంతో రోజువారీ డేటా కావాల్సిన యూజర్లు కచ్చితంగా 1.5GB ప్లాన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.500 కంటే తక్కువ ధరలో రోజువారీ 1.5GB డేటాను అందించే (jio 1.5GB Daily Data Plans) రీఛార్జ్ ప్లాన్ల వివరాలు.
జియో రూ.239 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్ పొందుతారు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ (Jio Rs239 Recharge plan) వ్యాలిడిటీ 22 రోజులుగా ఉంది. ఈ ప్లాన్లో మొత్తంగా 33GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ యాప్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
రూ.299 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్ లో ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ (Jio Rs299 Recharge plan) వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో మొత్తంగా 42GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ యాప్ లను కూడా ఉపయోగించుకోవచ్చు.
జియో రూ.319 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు జియో ప్రీపెయిడ్ యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. మరియు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్ లో రోజువారీ 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Jio Rs319 Recharge plan) వ్యాలిడిటీ నెలరోజులుగా (Calender Month) ఉంటుంది. ఈ ప్లాన్ లో జియోటీవీ, జియో ఏఐక్లౌడ్ వంటి యాప్లను కూడా వినియోగించుకోవచ్చు.
జియో రూ.329 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్లో భాగంగా జియో ప్రీపెయిడ్ యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు ఈ ప్లాన్ లో ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ (Jio Rs329 Recharge plan) వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 42GB 4G డేటాను వినియోగించుకోగలుగుతారు. ఈ ప్లాన్ లో Jiosaavn Pro సబ్స్క్రిప్షన్ను కూడా పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ యాప్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
* జియో ఇటీవలే తన యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. 5G యూజర్లు 18 నెలల వరకు గూగుల్ జెమిని ప్రో మోడల్ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికి 18-25 సంవత్సరాల వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, దశలవారీగా మొత్తం యూజర్లకు ఈ అవకాశం కల్పిస్తామని జియో తెలిపింది. దీని ధర రూ.35 వేల వరకు ఉంటుందని తెలిపింది.


Click it and Unblock the Notifications