జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.349కే అపరిమిత 5G డేటా, ఉచిత ఓటీటీలు!
రిలయన్స్ జియో భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త 'యానివర్సరీ ఆఫర్'ను తీసుకొచ్చింది. పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ₹349 ప్రీపెయిడ్ ప్లాన్ను పరిమిత కాలానికి అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు మాత్రమే ఉండే ఈ ఆఫర్లో రోజూ 2GB డేటాతో పాటు జియో 5G నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5G డేటా లభిస్తుంది. అంతేకాకుండా, Wi-Fi, భాగస్వామ్య OTT యాక్సెస్తో కూడిన 2 నెలల ఉచిత 'జియోహోమ్' ట్రయల్ కూడా లభిస్తుంది. వీటితో పాటు జియోహాట్స్టార్, జియోసావన్ ప్రో, జొమాటో గోల్డ్, నెట్మెడ్స్ ఫస్ట్ సబ్స్క్రిప్షన్లు పొందవచ్చు. సెప్టెంబర్ 5 నుంచి మైజియో యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఎక్కువగా డేటా ఉపయోగించే ప్రీపెయిడ్ వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా రూ.349 ప్లాన్ను రూపొందించారు. అపరిమిత 5G స్పీడ్స్ కావాలంటే మీ దగ్గర 5G స్మార్ట్ఫోన్ ఉండటంతో పాటు మీ ఏరియాలో జియో 5G నెట్వర్క్ కవరేజ్ ఉండాలి. 5G లేని చోట రోజూ వచ్చే 2GB పరిమితి మేరకే హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఇక ఈ ప్లాన్తో వచ్చే బెనిఫిట్స్ విషయానికొస్తే.. రెండు నెలల ఉచిత జియోహోమ్ ట్రయల్తో వైఫైతో పాటు ఓటీటీలు అందుకోవచ్చు. వీటిలో ఒక నెల ఉచిత జియోహాట్స్టార్, ఒక నెల జియోసావన్ ప్రో, మూడు నెలల జొమాటో గోల్డ్ సభ్యత్వంతో పాటు ఆరు నెలల నెట్మెడ్స్ ఫస్ట్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి.

జియో ₹349 యానివర్సరీ ప్లాన్: అపరిమిత 5G, వ్యాలిడిటీ వివరాలు, జియోహోమ్ ట్రయల్
సెప్టెంబర్ 5 నుంచి మైజియో యాప్ లేదా వైబ్సైట్కి వెళ్తే రూ.349 ప్లాన్ బ్యానర్ కనిపిస్తుంది. రీఛార్జ్ చేసే ముందు మీ నంబర్కు ఆఫర్ వర్తిస్తుందో లేదో సరిచూసుకోండి. రీఛార్జ్ పూర్తయ్యాక, నిర్ణీత గడువులోగా పార్టనర్ బెనిఫిట్స్ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అర్హత ఉన్న లావాదేవీలపై 'జియోఫైనాన్స్' ద్వారా 2 శాతం డిజిటల్ గోల్డ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే గోల్డ్ క్రెడిట్, ట్రయల్ ఆఫర్లు ఎలా పనిచేస్తాయనేది యాప్లోని నిబంధనలు చదివి తెలుసుకోవడం మేలు. మీరు పూర్తిగా 5Gపైనే ఆధారపడాలనుకుంటే, ముందే మీ ఏరియాలో కవరేజ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి.
జియో ₹349 ప్లాన్ ఎవరికి బెస్ట్? ఎవరు కొంచెం ఆగాలి?
మీకు రోజూ ఎక్కువ డేటా, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, తాత్కాలిక వైఫై కనెక్షన్ అత్యవసరం అయితే ఈ ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వడం మంచి ఛాయిస్. ప్రస్తుతం రూ.299 ప్లాన్ వాడేవారికి ఓటీటీ ఆఫర్లు లేవు కాబట్టి, రూ.349 ప్లాన్ మరింత ప్రయోజనకరంగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఇలాంటి ఆఫర్లతో సమానమైన ప్లాన్ వాడుతుంటే మీ ప్రస్తుత వ్యాలిడిటీ ముగిసే వరకు వేచి చూడటం మంచిది. 5G నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ఉన్నవారికి లభించే అదనపు ప్రయోజనాలు కాస్త పరిమితంగానే ఉంటాయి. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి, సమయాన్ని బట్టి రీఛార్జ్ ప్లాన్ చేసుకోండి.
డేటా వృథా కాకుండా ఉండటానికి మైజియో యాప్లో మీ వాడకాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత ఎక్కువ వ్యాలిడిటీ ఉండే బేస్ ప్లాన్తో దీన్ని జత చేయడం ద్వారా ఓటీటీ బెనిఫిట్స్ను కొనసాగిస్తూనే మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫైబర్ కనెక్షన్ లేకపోతే, సాయంత్రాల పూట ఓటీటీ కంటెంట్ చూసేందుకు ఈ 'జియోహోమ్' ట్రయల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రాబోయే పండుగల షాపింగ్, ప్రయాణాలు, ఫుడ్ ఆర్డర్ల విషయంలో వేర్వేరు సబ్స్క్రిప్షన్ల కోసం అయ్యే ఖర్చును ఈ ప్లాన్తో ఆదా చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications