Just In
- 12 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 13 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 13 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 16 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- Movies Karthika Deepam 2 April 24th: దీప తాళికట్టిన భార్య.. నరసింహ చెప్ప పగలగొట్టిన సుమిత్ర
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జియో సంచలనాలు ఇప్పట్లో ఆగేలా లేవు, మళ్లీ టార్గెట్ !
దేశీయ టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన అనతికాలంలోనే నంబర్ స్థానాన్ని అటూ ఇటూగా ఉన్న ముఖేష్ అంబానీ ముద్దుబిడ్డ రిలయన్స్ జియో టెల్కోలకు ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది.
దేశీయ టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన అనతికాలంలోనే నంబర్ స్థానాన్ని అటూ ఇటూగా ఉన్న ముఖేష్ అంబానీ ముద్దుబిడ్డ రిలయన్స్ జియో టెల్కోలకు ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది. వస్తూనే ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియో ఆ తర్వాత టారిఫ్ ప్లాన్లలోనూ అదే జోరును కొనసాగించింది. టారిఫ్ పాన్ల దెబ్బకు కుదేలైన టెల్కోలు కూడా ఆ తర్వాత కోలుకొని జియోకి ధీటుగా ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చాయి. అయినప్పటికీ నష్టాల ఊబి నుంచి బయటపడలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ జియో టెల్కోలకు షాకిచ్చింది. ఈ సారి పోస్ట్ పెయిడ్ విభాగాన్ని టార్గెట్ చేస్తూ జియో టెల్కోలను దెబ్బకొట్టింది.
కాల్డ్రాప్ నిబంధనల ఉల్లంఘన,టెల్కోలపై ట్రాయ్ కఠిన నిర్ణయం
జియో పెయిడ్ మార్కెట్ని టార్గెట్..
తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం రిలయన్స్ జియో పెయిడ్ మార్కెట్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పోస్టు పెయిడ్ రీఛార్జ్ ప్యాక్ల రేట్లను తగ్గించడానికి సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తోంది.
రెండు నెలల క్రితమే
199 రూపాయల ప్లాన్ను గత రెండు నెలల క్రితమే రిలయన్స్ జియో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్పై 25 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, అపరిమిత ఎస్ఎంఎస్లు, ఉచిత రోమింగ్ను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది.
ఇతర టెలికాం దిగ్గజాలు సైతం ..
జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్తో, ఇతర టెలికాం దిగ్గజాలు సైతం తమ రేట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. వొడాఫోన్ తన డేటా పరిమితులను పెంచడానికి సరికొత్త పోస్టు పెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించడం ప్రారంభించింది.
వొడాఫోన్ రూ.299 ప్లాన్
జియో ప్లాన్ రూ.199కు పోటీగా వొడాఫోన్ రూ.299 ప్లాన్ను తీసుకొచ్చింది. రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్ల కింద రెండు రోజుల క్రితమే దీన్ని ఆవిష్కరించింది. ఈ ప్యాక్పై జియో కంటే కాస్త తక్కువగా 20 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంతేకాక అపరిమిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్, 100ఎస్ఎంఎస్లను అందిస్తోంది.
పోస్టుపెయిడ్ సెగ్మెంట్పై అనాసక్తి
అయితే ఇది కస్టమర్లలో జోష్ ని నింపే సూచనలు కనపడటం లేదు. దీనికి ప్రధాన కారణం పోస్టుపెయిడ్ సెగ్మెంట్పై కస్టమర్లకు ఉన్న అనాసక్తినేనని చెప్పవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని కస్టమర్లకు జియో సరికొత్త జోష్ను అందిస్తుందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు.
జియో ఎఫెక్ట్తో..
కాగా ఇప్పటికే జియో ఎఫెక్ట్తో వొడాఫోన్తో పాటు, టెలికాం, ఐడియా లాంటి సంస్థలు కూడా తమ పోస్టు పెయిడ్ ప్లాన్లను చౌకైన ధరల్లో ఆఫర్ చేయడం మొదలు పెడతాయని ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470