జియో Online గేమింగ్ టోర్నమెంట్...! గెలిస్తే రూ.12,50,000 మీ సొంతం.
రిలయన్స్ జియో, మీడియాటెక్తో కలిసి ఆన్లైన్ గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త గేమింగ్ టోర్నమెంట్ ను ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, రెండు సంస్థలు కలిసి 'గేమింగ్ మాస్టర్స్' అనే ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్ను నిర్వహిస్తాయి.

70 రోజుల పాటు జరిగే ఈ సుదీర్ఘ టోర్నమెంట్ కోసం రిజిస్ట్రేషన్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి మరియు అవి 2021 జనవరి 9 వరకు కొనసాగుతాయి. 2021 జనవరి 13 న ప్రారంభమై మార్చి 7, 2021 వరకు సాగే ఈ టోర్నమెంట్ JioTv HD ,Esports మరియు Youtube ఛానల్ లలో లైవ్ చూడవచ్చు.

విజేతలుగా నిలిచిన వారు రూ.12,50,000 బహుమతి గా గెలుచుకోవచ్చు.
ఆన్లైన్ గేమింగ్లో విప్లవాత్మక మార్పుల కోసం ఉద్దేశించిన గేమింగ్ మాస్టర్స్ టోర్నమెంట్ మీడియా టెక్ మరియు జియో రెండింటి సమిష్టి కృషి అని రిలయన్స్ జియో సంస్థ అధినేత చెప్పారు. ఈ టోర్నమెంట్ వర్చువల్ గేమింగ్ రంగంలో గేమర్ యొక్క నైపుణ్యం, జట్టుకృషి మరియు ఓర్పును పరీక్షిస్తుంది.చివరగా విజేతలుగా నిలిచిన వారు రూ.12,50,000 బహుమతి గా గెలుచుకోవచ్చు.
ఆసక్తిగల గేమర్స్ ఈ రాబోయే Esports టోర్నమెంట్ కోసం జియో గేమ్స్ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి నమోదు లేదా పాల్గొనే రుసుము లేదు. ఇంకా జియో మరియు నాన్-జియో వినియోగదారులు కూడా ఈ గేమింగ్ మాస్టర్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు.

Esports
Esports ని ఎలక్ట్రానిక్స్ స్పోర్ట్స్ అనికూడా పిలుస్తారు.ఇది వీడియో గేమ్లను ఉపయోగించి క్రీడా పోటీ ని ఉపయోగించి టోర్నమెంట్లు ఏర్పరుస్తుంది. ఇది తరచుగా వ్యవస్థీకృత, మల్టీప్లేయర్ వీడియో గేమ్ పోటీల ను ముఖ్యంగా ప్రొఫెషనల్ ప్లేయర్స్ మధ్య,వ్యక్తిగతంగా లేదా జట్లుగా.అదే గేమ్స్ ను ఏర్పరుస్తుంది.ఈ టోర్నమెంట్ ముఖ్యంగా, రిలయన్స్ జియో తన మొదటి ఆన్లైన్ గేమింగ్ ఈవెంట్ ‘ఇండియా కా గేమింగ్ ఛాంపియన్' పూర్తి చేసిన కొద్దీ రోజులకే ఏర్పాటు చేస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications








