జియో సంచలన ఆఫర్, 3.2 టీబీ 4జీ డేటా
దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తూ వెళుతున్న సంగతి అందరికీ సుపరిచితమే.
దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తూ వెళుతున్న సంగతి అందరికీ సుపరిచితమే. కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఎప్పటికప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అదే ఊపులో మరో సరికొత్త ఆఫర్ తో దూసుకువస్తోంది. జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్ పేరిట మరో సంచలన ఆఫర్ను తన ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద యూజర్లు 3.2 టీబీ జియో 4జీ డేటాను పొందనున్నారు. 4900 రూపాయల వరకు ప్రయోజనాలను జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు ఆఫర్ చేస్తోంది.

Jio Oppo Monsoon Offer
Jio Oppo Monsoon Offer పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్ పాత లేదా కొత్త జియో సిమ్ను కలిగి ఉన్న ఒప్పో ఫోన్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. ఇతర ఫోన్ కలిగిన వారు ఈ ఆఫర్ని పొందలేరు.

జూన్ 28 నుంచి..
అయితే ఈ ఆఫర్ పొందడానికి కొత్త ఒప్పో ఫోనే కొనుగోలు చేయాల్సినవసరం లేదు. పాత ఒప్పో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జియో సిమ్ ద్వారా ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. జూన్ 28 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

రూ.198,రూ.299
ఈ ఆఫర్ను పొందడానికి మాత్రం సబ్స్క్రైబర్లు 198 రూపాయలు, 299 రూపాయల జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో తమ ఫోన్లకు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

1800 రూపాయల క్యాష్బ్యాక్
ఈ ఆఫర్ ద్వారా 1800 రూపాయల క్యాష్బ్యాక్ను యూజర్లు 50 రూపాయల విలువైన 36 క్యాష్బ్యాక్ ఓచర్ల రూపంలో పొందనున్నారు.

మూడు సార్లు..
13వ, 26వ, 39వ రీఛార్జ్ల అనంతరం 600 రూపాయల చొప్పున మూడు సార్లు యూజర్లకు 1800 రూపాయలు క్రెడిట్ కానున్నాయి.

మేక్మైట్రిప్ నుంచి..
మేక్మైట్రిప్ నుంచి 1300 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉండనున్నాయి. మైజియో యాప్లో ఉన్న ఫోన్ పే ద్వారా రీఛార్జ్ చేసుకున్న వారికి రూ.50 క్యాష్ బ్యాక్ ఓచర్లు వెంటనే పొందవచ్చు. రూ.299 రీఛార్జ్పై ప్రస్తుతం జియో 126 జీబీ డేటాను అందిస్తోంది.


Click it and Unblock the Notifications