Rs.699 లకే జియో ఫోన్: దీపావళి ఆఫర్
4G LTEకి మద్దతు ఇచ్చే సరసమైన స్మార్ట్ ఫీచర్ జియో ఫోన్ ఈ ఫెస్టివల్ సీజన్ లో రూ.699ల ప్రత్యేక ధరతో అందిస్తున్నట్లు రిలయన్స్ జియో నేడు ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది. ఈ ఫోన్ను జూలై 2017 లో రూ.1,500 లతో ప్రారంభించారు. గత నెలలో రూ. 501 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుకున్నప్పటికీ ఇప్పుడు దాని ధరను మరింత సరసంగా అందిస్తోంది. అయితే "జియో ఫోన్ దీపావళి 2019" ఆఫర్ కింద లభించే కొత్త డిస్కౌంట్ ధర ఎటువంటి "ప్రత్యేక షరతులు" లేదా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లేకుండా వర్తిస్తుందని టెల్కో ఇప్పుడు ప్రకటించింది.

ధర మరియు ఆఫర్స్
జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్ ప్రకారం ఇండియాలో జియో ఫోన్ ధర 699 రూపాయలు. దీనిని కొన్న వినియోగదారులకు రిలయన్స్ జియో రూ.700ల విలువైన డేటా రీఛార్జ్ ను అందిస్తుంది. అదనపు డేటాను పొందటానికి కస్టమర్లు రూ. 99 విలువైన మొదటి ఏడు రీఛార్జిలను ఛస్తే పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్
KaiOS ఆధారిత జియో ఫోన్ 2.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 1.2GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్తో పాటు ఇది 512MB ర్యామ్తో పనిచేస్తుంది. ఫోన్లో 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా మెమొరీని128 జీబీ వరకు విస్తరించవచ్చు. ఇందులో వై-ఫై కనెక్టివిటీతో పాటు 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది.

ఈ ఫోన్ గూగుల్ అసిస్టెంట్ మద్దతుతో వస్తుంది. జియో ఫోన్లోని గూగుల్ అసిస్టెంట్ 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీనికి USB కేబుల్ ఉపయోగించి HDTV కి ఫోన్లో ప్లే అవుతున్న కంటెంట్ను పంపిణి చేయవచ్చు. ఇంకా ఫేస్బుక్, గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ మరియు యూట్యూబ్ వంటి యాప్ ల మద్దతుతో వస్తుంది.


Click it and Unblock the Notifications








