Just In
- 12 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
దిగ్గజాలకు జియో మరో షాక్, వైఫైతో వాయిస్ కాల్స్
టెలికాం రంగంలో రోజు రోజుకు సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్లకు తిరుగులేని దెబ్బ కొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే వాయిస్ ఓవర్ వైఫై సేవలను అందించనున్నట్టు జియో ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇతర టెల్కోలతో పోటీ అనివార్యమైన నేపథ్యంలో జియో కొత్తగా ఏం తీసుకువస్తుందనే దాని మీద టెక్ విశ్లేషకులు తమ మొదడుకు పనిచెబుతున్నారు. కాగా మరికొద్ది సేపటిలో రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 స్టార్ట్ కానుంది.

వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల
వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల సిగ్నల్ తక్కువగా ఉన్న, సరిగా అందని ప్రాంతాల్లోని వినియోగదారులకు కాల్ డ్రాప్స్ బెడద ఉండదు.

గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ సేవలు ..
గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. ఈ సేవల కోసం జియో తన 4జీ ఫీచర్ ఫోన్లలు అవసరమైన మార్పులు చేస్తున్నట్టు జియో సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

4జీ ఫీచర్ ఫోన్లతో
జియో ప్రవేశపెట్టి 4జీ ఫీచర్ ఫోన్లతో ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆ సంస్థకు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక 50 కోట్లమంది జియో ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018
రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 మీటింగ్ ఈ రోజు జరగననున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలను అధినేత ముకేష్ అంబానీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అవేంటో ఓ సారి చూద్దాం.

గత 12 నెలల కాలంలో
గత 12 నెలల కాలంలో జియో నెట్ వర్క్ కెపాసిటి రెండింతలు పెరిగింది. జియో యూజర్లు రొజుకు యావరేజ్ గా 290 నిమిషాలు జియో నెట్ వర్క్ వాడుతున్నారని అధినేత ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెరుగుదల 20 శాతంగా ఉంది.

215 మిలియన్ కస్టమర్లను..
జియోకి ఇప్పటివరకు 215 మిలియన్ కస్టమర్లను కలిగిఉంది. 22 నెలల కాలంలోనే ఈ మైలురాయిని చేరుకున్నామని ప్రకటించే అవకాశం ఉంది.

డేటా
డేటా విషయంలో జియో చాలా స్పీడుగా ముందుకెళుతోంది. జియో డేటా వాడకం 125 కోట్ల జిబి నుండి 205 కోట్ల జిబికు పెరిగింది.

జియో ఫోన్
జియో ఫోన్ ను ఇప్పటిదాకా 25 మిలియన్ల మందికి పైగానే చేజిక్కించుకున్నారు. జియో ఫోన్ నెక్ట్స్ లెవల్ గురించి ఇకపై మా చర్చలు సాగుతాయని ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.

స్పష్టమైన ప్రకటన..
అలాగే broadband space, JioFiber launch మీద కూడా స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఇది యూజర్లను ఊరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

మరికొద్ది సేపట్లో..
కాగా మరికొద్ది సేపట్లో రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో జియో ఏ సంచలనాలను బయటకు తీసుకువస్తోందనని యూజర్లు అంతా ఎదురుచూస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470