7 కోట్లు దాటిన Jio యూజర్లు
జియో రోజుకు సగటున 6 లక్షల యూజర్లను రాబట్టుకోగలిగింది.
దేశవ్యాప్తంగా జియో సేవలను వినియోగించుకుంటున్న యూజర్ల సంఖ్య డిసెంబర్ 31, 2016 నాటికి 72.4 మిలియన్లకు చేరుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం తెలిపింది. లాంచ్ అయిన నాటి నుంచి కేవలం 83 రోజుల్లోనే 5 కోట్ల కస్టమర్ బేస్కు రీచ్ అయిన జియో రోజుకు సగటున 6 లక్షల యూజర్లను రాబట్టుకోగలిగింది. రానున్న రోజుల్లో 90శాతం కంటే ఎక్కువ జనాభాను జియో సేవలు కవర్ చేస్తాయని రిలయన్స్ తెలిపింది.
Read More : గూగుల్ పిక్సల్ ఫోన్ల పై రూ.26,000 ఉచిత ఆఫర్లు

మార్కెట్లో లాంచ్ అయిన నాలుగు నెలలు కావస్తున్నప్పటికి కాల్ ఫెయిల్యుర్ సమస్యలు జియోనే వేధిస్తూనే ఉన్నాయి. జియో నెట్వర్క్ నుంచి ఎయిర్టెల్ నెట్వర్క్కు వెళుతున్న ప్రతి 1000 కాల్స్ లో 175 కాల్స్ ఫెయిల్ అవుతున్నట్లు జియో ఆరోపిస్తోంది. సర్వీస్ క్వాలిటీ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి 1000 కాల్స్కు 5 కాల్స్కు మించి ఫెయిల్ కాకూడదని రిలయన్స్ పేర్కొంది.
Read More : మిస్సుడ్ కాల్ ఇవ్వండి, మీ బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోండి (ఏ బ్యాంక్ అయినా సరే )

జియో ఇన్ఫోకామ్ నెట్వర్క్ను ప్రారంభించడానికి ఇప్పటికే 1.71 లక్షల కోట్లను వెచ్చించిన రిలయన్స్ టెలికం యూనిట్ను మరితగా బలోపేతం చేసేందుకు మరో 30,000 కోట్లను వెచ్చించనుంది. కొత్తగా జియో పై వెచ్చించే మొత్తం నెట్వర్క్ బలోపేతానికి తోడ్పడుతుందని జియో ఇన్ఫోకామ్ భావిస్తోంది.
Read More : సామ్సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. రూ.6,890, రూ.8,490


Click it and Unblock the Notifications








