జియోతో షియోమి చెట్టాపట్టాల్, ఈ స్నేహం ఏ తీరానికి ?

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో చైనా దిగ్గజం షియోమితో జతకట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By Hazarath
|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో చైనా దిగ్గజం షియోమితో జతకట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంచలనానికి తెరలేపుతూ అతి త్వరలోనే ఈ రెండు దిగ్గజాలు ఒక్కటవ్వబోతున్నాయని ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఆన్‌లైన్ మార్కెట్లో దుమ్మురేపుతున్న చైనా దిగ్గజం ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ సత్తా చాటాలని గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా జియో స్టోర్లపై కన్నేసినట్లు తెలుస్తోంది.

Xiaomi ఫోన్లపై డిస్కౌంట్లు షురూ, తగ్గింపు రెండు రోజులు మాత్రమే !Xiaomi ఫోన్లపై డిస్కౌంట్లు షురూ, తగ్గింపు రెండు రోజులు మాత్రమే !

జియో స్టోర్ల ద్వారా

జియో స్టోర్ల ద్వారా

జియో స్టోర్ల ద్వారా షియోమి తన స్మార్ట్ ఫోన్లను అలాగే ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న జియో స్టోర్లలో షియోమి ఫోన్లను రంగంలోకి దించేందుకు రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది.

షియోమి తన టీవీలను ..

షియోమి తన టీవీలను ..

ఈ ఏడాది షియోమి తన టీవీలను ఇండియాలో లాంచ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ టీవీలను జియో స్టోర్ల ద్వారా విక్రయించాలని చూస్తోంది. ఎలాగూ ఈ కామర్స్ మార్కెట్లో తిరుగులేదు కాబట్టి జియోతో జట్టు కట్టడం ద్వారా ఆఫ్ లైన్ మార్కెట్లో సత్తా చాటి ఇండియాలో నంబర్ వన్ గా ఎదగాలని చూస్తోంది.

జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తో షియోమి మంతనాలు ..
 

జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తో షియోమి మంతనాలు ..

ఈ మేరకు జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తో షియోమి మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ విషయంపైనే అనేక సార్లు రెండు కంపెనీల మధ్య చర్చలు నడిచాయని అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదని అతి త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని ఈ పత్రిక రిపోర్ట్ చేసింది.

ఇండియాలో ఇప్పుడు నంబర్ వన్..

ఇండియాలో ఇప్పుడు నంబర్ వన్..

ప్రముఖ రీసెర్చ్ ఏజెన్సీ కౌంటర్ పాయింట్ ప్రకారం షియోమి ఇండియాలో ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా నంబర్ వన్ గా ఉన్న శాంసంగ్‌ను రెండవ స్థానంలోకి నెట్టి షియోమి ఇండియాలో అగ్రస్థానానికి ఎగబాకిందని కౌంటర్ పాయింట్ తెలిపింది. అయితే ఇది కేవలం ఆన్ లైన్ మార్కెట్లో మాత్రమేనని తెలిపింది.

ఆఫ్‌లైన్ మార్కెట్లో సత్తా చాటేందుకు..

ఆఫ్‌లైన్ మార్కెట్లో సత్తా చాటేందుకు..

ఈ ఏడాది షియోమి ఆఫ్‌లైన్ మార్కెట్లో సత్తా చాటేందుకు భారీగా పెట్టుబడులను కుమ్మరిస్తోంది. కాగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస‍్థల ధస్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది.

శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస‍్థల ధరలతో..

శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస‍్థల ధరలతో..

శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస‍్థల ధరలతో పోలిస్తే సరసమైన ధరలకు ఫీచర్‌, రిచ్‌, హై ఎండ్‌ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది.రలతో పోలిస్తే సరసమైన ధరలకు ఫీచర్‌, రిచ్‌, హై ఎండ్‌ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది.

Best Mobiles in India

English summary
Jio and Xiaomi may join hands to sell Redmi phones, launch Xiaomi TV in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X