జియోఫోన్ అమ్మకాల సునామి, హాట్ కేకుల్లా 5 కోట్ల ఫోన్లు..
ప్రముఖ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో ాదాపు 5 కోట్ల జియో ఫోన్ల అమ్మకాలు జరిపిందని తెలిపింది. 2017లో ఇదే అత్యంత పెద్ద సునామి అని తెలిపింది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఈ స్థాయిని ఎవరూ
స్మార్ట్ ఫోన్ మార్కెట్ దూసుకుపోతున్న తరుణంలో ఫీచర్ ఫోన్లు తెర వనెక్కి వెళుతున్న సంగతి అందరికీ విదితమే. ఆండ్రాయిడ్ దెబ్బకు ఫీచర్ ఫోన్ మార్కెట్లో చీకట్లు కమ్ముకున్నాయి. అయితే ఫీచర్ ఫోన్ మార్కెట్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్ కి సవాల్ విసరగలదని జియోోన్ ప్రూవ్ చేసింది. ముఖేష అంబాని రిలయన్స్ జియో నుంచి సునామిలా దూసుకువచ్చిన జియోఫోన్ ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. 2017లో మొత్తం మొబైల్ మార్కెట్ నే శాసించింది. కియోస్ సాప్ట్ వేర్ తో పాటు అత్యవసమైన యాప్స్ తో వచ్చిన జియోఫోన్ అభిమానులను ఓ ఊపు ఊపి కోట్ల అమ్మకాలను కొల్లగొట్టింది.


కౌంటర్ పాయింట్ నివేదిక
ప్రముఖ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో ాదాపు 5 కోట్ల జియో ఫోన్ల అమ్మకాలు జరిపిందని తెలిపింది. 2017లో ఇదే అత్యంత పెద్ద సునామి అని తెలిపింది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఈ స్థాయిని ఎవరూ చేరుకోలేని స్పష్టం చేసింది.

కియోస్ ఆపరేటింగ్ సిస్టం
కియోస్ సాప్ట్ వేర్ తో వచ్చిన ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లకు ధీటుగా మార్కెట్లోకి వచ్చిందని సొంత యాప్ స్టోర్ ని ఇది కలిగి ఉండటమనేది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమని తెలిపింది.

యాప్స్
ఈ ఫోన్లో డెవలపర్స్ సొంతంగా కొన్ని యాప్స్ తయారుచేశారు. వాట్సప్ , ఫేస్ బుక్, గూగుల్ అసిస్టెంట్ లాంటి ఫీచర్లను ఇందులో జోడించారు. 2జి నెట్ వర్క్ లో 4జీని అందుకోవడం జియోతోనే సాధ్యమని తెలిపింది.

వచ్చే మూడేళ్లలో
రానున్న 3 సంవత్సరాల కాలంలో స్మార్ట్ ఫీచర్ ఫోన్ మార్కెట్ 28 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 300 మిల్లియన్ స్మార్ట్ ఫీచర్ ఫోన్లు 2021కు మొబైలల్ మార్కెట్లోకి రానున్నాయని రీసెర్చ్ నివేదిలో చెప్పారు.

మిడ్ టర్మ్ రెవిన్యూ
కౌంటర్ రీసెర్చ్ డైరక్టర్ నెయిల్ షా మాట్లాడుతూ మిడ్ టర్మ్ రెవిన్యూలో దాదాపు 71 శాతం సాప్ట్ వేర సర్వీసులే కంట్రిబ్యూట్ చేస్తాయని తెలిపారు. ఇండియా అతి పెద్ద ఫీచర్ ఫోన్ మార్కెట్ అవుతుందని కూడా తెలిపారు.


Click it and Unblock the Notifications








