Just In
- 7 hrs ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- 1 day ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 2 days ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Sports
Big Bash League : క్రీజులో భారీ హిట్టర్లున్నా.. ఓటమి మాత్రం తప్పలేదు..!
- News
లాస్ ఏంజెల్స్ మాంటేరీ పార్క్లో కాల్పులు: 10 మంది మృతి, పలువురికి గాయాలు
- Movies
Telugu Tv Actress ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. వంటలక్కకు పోటీగా సీనియర్ నటి!
- Finance
Adani Group: శుభవార్త చెప్పిన గౌతమ్ అదానీ..! త్వరలోనే ప్రారంభం కానున్న 5 IPOలు..
- Automobiles
రేపటి నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
రైల్వే స్టేషన్లో వచ్చే ఉచిత వైఫై ఓ కూలి వాడి జీవితాన్ని మార్చేసింది
రైల్వే స్టేషన్లో ఉచితంగా వచ్చే వైపై ఓ రైల్వే కూలి జీవితాన్ని మార్చివేసింది. అతని భవిష్యత్తును బంగారు బాట చేసింది. చదివేందుకు డబ్బులు కూడా లేని ఆ కూలి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నంలో చివరిమెట్టు మీద ఉన్నాడు. తనకు తాను అవకాశాన్ని సృష్టించుకుని రైల్వే వైఫై ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టబోతున్న ఆ యువకుడిని తలుచుకుంటే అందరికీ ఓ మోడల్ అనిపించకమానదు. వివరాల్లోకెళితే.. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో శ్రీనాథ్ అనే కుర్రాడు సాధించిన ఈ విజయం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీనాథ్ తన కుటుంబ పోషణ కోసం గత ఐదేళ్లుగా కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్నాడు.

ఓ వైపు లగేజీలు మోస్తూనే ..
తోటి కూలీల మాదిరిగా కాకుండా ఓ వైపు లగేజీలు మోస్తూనే మరోవైపు ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాఠాలు వినేవాడు. తన మిత్రుడి సూచన మేరకు అలా డిజిటల్ కోర్సు పాఠాలు విని, ప్రతిరోజూ సాయంత్రం నెమరువేసుకున్నాడు.

ఉచిత వైఫై సర్వీస్ను..
హైస్కూల్ విద్య పూర్తిచేసిన అతడు ఎర్నాకుళం రైల్వే స్టేషన్లోని ఉచిత వైఫై సర్వీస్ను తనకు అనుకూలంగా మార్చుకుని ఈ ఘనతను సాధించడం విశేషం. నేను ఇప్పటికి మూడు సార్లు పరీక్ష రాశాను. రైల్వే స్టేషన్లోని వైఫైని ఉపయోగించుకుని ప్రిపేర్ అవ్వడం ఇదే మొదటిసారంటూ తన మనసులో మాట చెప్పారు.

ఇయర్ఫోన్స్ పెట్టుకుని..
ఓ వైపు లగేజీలు మోస్తూనే ఇయర్ఫోన్స్ పెట్టుకుని స్టడీమెటీరియల్ వింటూ, ప్రశ్నలకు జవాబులు ఆలోచించేవాడిని. అలా పనిచేసేటప్పుడే ఏకకాలంలో పరీక్షలకు కూడా సిద్ధమయ్యాను. ప్రతిరోజూ పడుకునే ముందు, ఖాళీ సమయంలో ఆరోజు విన్న పాఠాలన్నీ గుర్తుచేసుకునేవాణ్ణి అంటూ శ్రీనాథ్ వివరించాడు.
|
ఇంటర్వ్యూ ఘట్టం దాటితే..
కేరళలోని మున్నార్కి చెందిన శ్రీనాథ్ కేపీఎస్సీలో ఇంటర్వ్యూ ఘట్టం దాటితే రెవెన్యూ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగం సాధించేవరకు చదువుతూనే ఉంటాను. కుటుంబ పోషణకోసం పనిచేయక తప్పని సరి కావడంతో కూలీ పని చేస్తూనే పరీక్షలు రాస్తాను. ఎన్ని ఎక్కువ పరీక్షలు రాస్తే అంత మంచి ఉద్యోగం వస్తుంది...'' అని శ్రీనాథ్ చెబుతున్నాడు. ఈ విషయాన్ని Ani న్యూస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

మంచి ఉద్యోగి ఎవరని ..
ఇంతకీ అతడి ఉద్దేశంలో మంచి ఉద్యోగి ఎవరని అడిగితే ఏం చెప్పాడో తెలుసా..‘‘గ్రామంలోని పరిస్థితులను మార్చగల అధికారం ఉన్న ఎవరో ఒకరు..'' అని చెప్పడం అతనిలోని మంచి గుణాన్ని తెలియజేస్తుంది కదా.

డిజిటల్ ఇండియాలో భాగంగా..
డిజిటల్ ఇండియాలో భాగంగా 2016లో ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సదుపాయానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నాటికి దేశవ్యాప్తంగా కనీసం 685 రైల్వే స్టేషన్లలో వైఫై టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు.

2019 మార్చి నాటికి
2019 మార్చి నాటికి రూ.700 కోట్ల వ్యయంతో దేశంలోని మొత్తం 8,500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం ఏర్పాటు కానుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470