టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
ప్రపంచంలోనే అతిపెద్ద పైరసీ వెబ్సైట్ 'కిక్ ఆస్ టోరెంట్స్ అధినేత ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. ఏ భాషలో సినిమా విడుదలయినా సరే అది మరుసటి రోజుకల్లా ఈ వెబ్ సైట్ లో దర్శనమిచ్చేది. దీంతో చాలామంది సినిమాను రిలీజయిన తరువాత రోజే డౌన్ లోడ్ చేసుకుని చూడటం వల్ల నిర్మాతల రెవిన్యూ పై దెబ్బ పడేది. అయితే ఇది ఎవరు చేస్తున్నారనే విషయం మాత్రం ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియలేదు, అయితే ఇప్పుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టించింది ఎవరో కాదు ఆపిల్ కంపెనీ. అదెలాగో మీరే చూడండి.
కబాలి సినిమాపై ట్విట్టర్లో రియాక్షన్ ఎలా ఉందంటే..

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
ప్రపంచంలోనే అతిపెద్ద పైరసీ దొంగ ఎవరో తెలిసిపోయింది. 'కిక్ ఆస్ టోరెంట్స్' అనే పైరసీ వెబ్ సైట్ ని నడుపుతున్న అతని పేరు ఆర్టెమ్ వాలిన్. ఉక్రెయిన్ దేశానికి చెందిన వాలిన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
అయితే, ఈ దొంగ వివరాలు తెలియజేసిన క్రెడిట్ మాత్రం ప్రముఖ సంస్థ 'ఆపిల్'కే దక్కుతుంది. తన ఐ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్న వాలిన్ వివరాలను అమెరికా పోలీసులకు అందించింది.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
ఇప్పటికే వాలిన్ పై కాపీరైట్ ఉల్లంఘన, మనీ లాండరింగ్ తో పాటు పలు కేసులు నమోదు అయ్యాయి. తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో వాలిన్ తరచుగా మకాం మారుస్తూ పలు దేశాలకు వెళుతుండేవాడు.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
అతనికి సంబంధించిన ఒక బ్యాంకు అకౌంట్ తో పాటు వెబ్ సైట్ కు అనుబంధంగా ఉన్న ఏడు డొమైన్ నేమ్స్ ను కూడా పోలీసులు నిలిపి వేశారు.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
దరిదాపుగా రూ .6,724 కోట్ల విలువ చేసే సినిమాలు, సంగీతం తదితరాలను చట్టవిరుద్ధంగా ఇతడు కాపీ చేసినట్లు అభియోగం.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
ఇక కిక్ ఆస్ టోరెంట్స్ వెబ్ సైట్ విలువను 363 కోట్లు లెక్కగట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 28 భాషలకు సంబంధించిన సినిమాలను పైరసీ చేసి తన వెబ్ సైట్ ద్వారా వాలిన్ అందిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
ఇంటర్నెట్లో అందరూ సెర్చ్ చేసే 69వ వెబ్ సైట్ గా పేరుతెచ్చుకుంది. 28 భాషల్లో సేవలు అందిస్తోంది. ఏటా వాణిజ్య ప్రకటనల నుంచి సుమారు రూ .150 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్
బ్రిటన్, ఐర్లాండ్, ఇటలీ, డెన్మార్క్, బెల్జియం, మలేషియాల్లో వాలిన్ డొమైన్స్ ను ఇప్పటికే నిలిపివేశారు. ప్రస్తుతం వాలిన్ పై చికాగో కోర్టులో విచారణ జరుగుతోంది.


Click it and Unblock the Notifications








