లెనోవో 4జీ ఫోన్, రూ.5000లోపే?

2015, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) వేదికగా చౌక ధర 4జీ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనున్నట్లు లెనోవో పేర్కొంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.5,000 లోపు ఉండొచ్చని తెలుస్తోంది. స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్తో రన్ అయ్యే ఫోన్ జనవరి 15లోపే భారత్లో విడుదలవుతుందని పలు మీడియా రిపోర్ట్స్ అంచనావేస్తున్నాయి. సీఈఎస్ 2015 లాస్ వేగాస్ వేదికగా జనవరి 6 నుంచి 9వరకు జరుగుతుంది.
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్డేట్స్ పొందండి
మార్కెట్లోకి షియోమీ రెడ్మై నోట్ 4జీ
షియోమీ రైడ్మై నోట్ 4జీ వేరియంట్ స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఇండియన్ మార్కెట్లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్కార్ట్ ఈ స్మార్ట్ఫోన్లను ఎక్స్క్లూజివ్గా విక్రియస్తోంది. దాదాపుగా రెండ లక్షల మంది యూజర్లు ఈ ఫోన్లను రిజిస్టర్ చేసుకున్నారు. మొదటి స్టాక్లో భాగంగా 40,000 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచటంతో 6 సెకన్లలోనే మొత్తం ఫోన్లు అమ్ముడైపోయినట్లు షియోమీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
మార్కెట్లో షియోమీ రైడ్మై నోట్ 4జీ వేరియంట్ ధర రూ.9,999. ఈ డివైస్ను కొనుగోలు చేయదలిచిన వారు ముందుగా ఫోన్ను రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది.షియోమీ రైడ్మై నోట్ 4జీ స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లు 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎమ్ఐయూఐ 5 ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఆధారం).


Click it and Unblock the Notifications








