నోయిడా ఆధారితంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ టక్నాలజీ సంస్థ పాంటెల్ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్ (పీటీపీఎల్), ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో జతకట్టి భారతదేశపు మొట్టమొదటి 2జీ సిమ్ స్లాట్ టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. పేరు పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ (Penta T-Pad WS703C).ధర రూ.6,999. ఈ గ్యాడ్జెట్ ద్వారా మొబైలింగ్.. కంప్యూటింగ్ అదేవిధంగా 3డీ అనుభూతులను ఏకకాలంలో ఆస్వాదించవచ్చు.