మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ ‘ఎరోస్ ప్లస్’, ధర రూ.4,229
దేశవాళీ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ 'ఎం-టెక్’ (M-tech) మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఎరోస్ ప్లస్ (Eros Plus) పేరుతో లాంచ్ అయిన ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ ధర రూ.4,299.

స్టైలిష్ డిజైన్తో బ్లెండ్ కాబడిన ఈ స్మార్ట్ఫోన్ హై-పెర్ఫామెన్స్ను ఆఫర్ చేయటంతో పాటు వాల్యూ ఫర్ మనీగా నిలుస్తుందని ఎం-టెక్ ఇన్ఫర్మాటిక్స్ లిమిటెడ్ కో-ఫౌండర్ గౌతమ్ కుమార్ తెలిపారు. అన్ని ప్రముఖ రిటైల్ అవుట్లెట్లతో పాటు లీడింగ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ఎం-టెక్ ఎరోస్ ప్లస్ స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల FVWGA ఎల్సీడీ డిస్ప్లే (స్ర్కీన్ రిజల్యూషన్ 480 x 854 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ 1.3GHz ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటలీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2000mAh బ్యాటరీ, వై-ఫై 802.11, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్ట్, జీపీఎస్, 3జీ ఇంకా 2జీ నెట్వర్క్ సపోర్ట్.


Click it and Unblock the Notifications








