నడిరోడ్డులో నరుకుతున్నా ఎవరూ అడ్డుచెప్పలేదు, షాకిచ్చిన సీసీటీవీ పుటేజీ
మొన్న మారుతీ రావు నిన్న రామాచారి నేడు మహేష్ గౌడ్ తండ్రి రోజురోజుకి మానవత్వం మంటకలిసిపోతోంది .
మొన్న మారుతీ రావు నిన్న రామాచారి నేడు మహేష్ గౌడ్ తండ్రి రోజురోజుకి మానవత్వం మంటకలిసిపోతోంది . హైదరాబాద్ నేలరాలకు అడ్డాగా మారింది. హైదరాబాద్ లో జనాలు ఉండడానికి భయపడుతున్నారు ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో అని. ఒకటి పరువు హత్య మరొకటి ప్రేమ హత్య ఈరోజు కొడుకు కోసం కొడుకు మీద ప్రేమ మరియు కొడుకుని చంపిన వారిమీద పగతో హత్య పోలీసులు ఉన్న ప్రజలు అంత చూస్తున్న కొడకా నిన్ను చంపినవాడిని నీ దగ్గరికి పంపుతున్న అంటూ......సీసీ టీవిలో రికార్డయిన వీడియో చూస్తుంటే వొళ్ళు జలదరిస్తోంది

మహేష్గౌడ్ అనే యువకుడిని రమేష్ అతని స్నేహితులు కలిసి....
2017 డిసెంబర్ 24వ తేదీన మహేష్గౌడ్ అనే యువకుడిని రమేష్ అతని స్నేహితులు కలిసి హత్య చేశారు. ఈ కేసు విషయమై కోర్టు నుండి రమేష్ తిరిగి వస్తుండగా మహేష్ గౌడ్ తండ్రి రమేష్ను గొడ్డలితో నరికి చంపాడు.

రమేష్ ను చంపిన గొడ్డలిని అక్కడే వేశాడు....
ఆ తర్వాత రమేష్ ను చంపిన గొడ్డలిని అక్కడే వేశాడు. రమేష్ చనిపోయాడని నిర్ధారించుకొన్న తర్వాత మహేష్ తండ్రి అందరి ముందే నవ్వుతూ ఆకాశంలోకి చూస్తూ...కొడుకా.. నీ దగ్గరే రమేష్ను కూడ పంపాను అంటూ అరిచాడు.

మహేష్ను చంపిన విషయాన్ని....
మహేష్ను చంపిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నాడు. మరోవైపు తన కొడుకును చంపిన రమేష్ ను చంపిన ఆనందంతో మహేష్ తండ్రి కన్పించాడు. ఈ ఆనందంలోనే కొడుకా.. నిన్ను చంపినవాడిని నీ వద్దకే పంపాను అంటూ ఆకాశం వైపు చూస్తూ బిగ్గరగా అరిచాడు.

పక్క ప్లాన్ తో....
గత మాసంలో కోర్టు వాయిదాకు వచ్చిన రమేష్ ఏ మార్గం గుండా వెళ్తున్నారనే విషయమై మహేష్ తండ్రి రెక్కీ నిర్వహించాడు.ఈ రెక్కీ ఆధారంగా ఇవాళ కోర్టు వాయిదా నుండి తిరిగి వెళ్తున్న రమేష్పై మహేష్ తండ్రితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అత్తాపూర్ 143 నెంబర్ పిల్లర్ వద్ద గొడ్డలితో హత్య చేశాడు.


Click it and Unblock the Notifications