Coronavirus పై ఫైట్ కు గేమ్ ను కనిపెట్టిన 9 తరగతి కుర్రాడు! ప్రత్యేకతలేంటి!
ఇటీవలి అధికారిక నివేదికల ప్రకారం, దేశం లో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి.ఈ కరోనా వైరస్ లక్షణాలలో జలుబు, శరీరం అంతా నొప్పులు, దగ్గు, తుమ్ము లు, జ్వరం మరియు ఛాతీ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది తేలికపాటి జ్వరంతో ప్రారంభమవుతుందని అందరికి తెలిసిన లక్షణమే.

కరోనా వైరస్ సోకిన వ్యక్తులతో మీకు ప్రత్యక్ష సంబంధం ఉంటే,ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అయితే వైద్యులు మరియు నర్సులు ఆసుపత్రిలో చేరిన రోగులను నేరుగా పరీక్షించవలసి వచ్చినప్పుడు.ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నవారిని ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ విధంగా, వైద్యులు మరియు నర్సులు పూర్తి శరీర కవచాన్ని ధరించిన కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగుల చికిత్స చేస్తూ ఉంటారు.

మొబైల్ ఫోన్ గేమ్ ను సృష్టించాడు
ఇలాంటి ఈ ఘోరమైన లొక్డౌన్ మరియు అనిశ్చితిల మధ్యలో మణిపూర్లోని ఇంఫాల్కు చెందిన 9 వ తరగతి విద్యార్థి 'బల్దీప్ నింగ్టోజామ్' మొబైల్ ఫోన్ గేమ్ ను సృష్టించాడు. ఈ ఆట ప్రత్యేకంగా కరోనా నివారణకు మార్గదర్శకాలను సూచించే విధంగా ఉంటుంది.కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది దాన్ని ఎలా అరికట్టవచ్చు లాంటివి ఇందులో వివరించడం విశేషం.

గేమ్ గురించి బల్దీప్ మాట్లాడుతూ
ఈ ఆటకు Coroboi అని పేరుకూడా పెట్టారు. అంతే కాక Android వినియోగదారులు ఈ ఆటను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. ఈ గేమ్ గురించి విద్యార్థి బల్దీప్ మాట్లాడుతూ "కరోనా గురించి ఒక గేమ్ ను తయారు చేయాలనే ఆలోచన మామయ్య నాకు చెప్పారు, కాబట్టి నేను దానిపై ఆసక్తి పెంచుకున్నాను.ఈ ఆటను సృష్టించే పని గత వారంలోనే పూర్తయింది. కానీ నేను నిన్ననే ఈ విషయాన్నీ పరిచయం చేసాను. ఇది నాకు కొత్త వెంచర్. కాబట్టి ఈ ఆటకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి 3,4 వారాల పాటు కథనాలను చదవడానికి యూట్యూబ్ ద్వారా శోధించానని చెప్పాడు''.

భవిష్యత్తులో తాను
భవిష్యత్తులో తాను ప్రోటోకాల్ హ్యాకర్ అవ్వాలనుకుంటున్నాని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర టెక్నాలజీల గురించి మరింత తెలుసుకోవాలని వాటిపై పట్టుసాధించాలని చెప్పుకొచ్చాడు.

యూరోపియన్ దేశాలలో
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ రెండవ దాడిని ప్రారంభించినట్లు అనిపిస్తోంది, ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో. ఇటీవలి రోజుల్లో UK లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి సంభవం తీవ్రతరం అవుతోంది.మరో యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్లో, ఆరోగ్య మంత్రి ఆలివర్ వెర్న్, కొత్త కరోనావైరస్ వైరస్ 65 ఏళ్లు పైబడిన వారి కంటే 40 ఏళ్లలోపు వారిలో నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని హెచ్చరించారు.

ఫోన్ తో కూడా కొరోనాకు ట్రీట్మెంట్
ఇలాంటి సమయాల్లో కూడా టెక్నాలజీ ని కొరోనా నివారణకు ఎలావాదాల అని ఆలోచిస్తూ మేధావులు కొత్త విషయాలు కనుగొంటున్నారు.ఇటీవలే మొబైల్ ఫోన్ తో కూడా కొరోనాకు ట్రీట్మెంట్ చేయవచ్చని మా కథనాల ద్వారా మీకు తెలియచేసాము.


Click it and Unblock the Notifications








