నరేంద్ర మోడీపై రతన్ టాటా ప్రశంసల వర్షం

By Gizbot Bureau
|

ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజం, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా గొప్ప విజన్‌ కలిగిన నాయకులంటూ కొనియాడారు. బుధవారం గాంధీనగర్‌లోని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌(ఐఐఎస్‌) పారిశ్రామికవేత్త రతన్ టాటా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ, అమిత్‌ షా దూరదృష్టి గల నాయకులని ప్రశంసించారు.

విజన్‌ కలిగిన నాయకులు

దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి మోడీ, షా ఎన్నో దూరదృష్టి గల నిర్ణయాలను తీసుకున్నారని, విజన్‌ కలిగిన నాయకులకు మద్దతిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. 

నేషనల్ స్కిల్ డెవలప్మంట్‌ కార్పొరేషన్

సింగపూర్‌ ఐటీఈఎస్‌ నమూనాలో ప్రారంభమయ్యే ఈ సంస్థలు నేషనల్ స్కిల్ డెవలప్మంట్‌ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీఎస్‌) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తాయి. గాంధీనగర్‌లో ప్రారంభమయ్యే సంస్థలో రక్షణ, ఏరోస్పేస్, చమురు తదితర అంశాలలో శిక్షణ ఇస్తారు. 

టాటా గ్రూప్‌ ఐఐఎస్‌కు భాగస్వామి

మానవ వనరులను సమృద్దిగా ఉపయోగించడమే ఈ సంస్థలు లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా గ్రూప్‌ ఐఐఎస్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ఐఐఎస్‌ను ప్రారంభించింది. కాన్‌పూర్‌, మొంబైలలో ఐఐఎస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Best Mobiles in India

English summary
Many Visionary Initiatives Undertaken By Modi Government': Ratan Tata

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X