హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ సీఈఓ.. ఆసక్తికరం
మైక్రోసాఫ్ట్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఇటీవల భాద్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఆ హోదాలో మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 29న సత్య నాదెళ్ల హైదరాబాద్కు రానున్నారు.

సత్య నాదెళ్ల రాక కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సత్య నాదెళ్ల పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకుంది.
హైదరాబాద్ పర్యటనకు రానున్న సత్య నాదెళ్ల తొలత నగరంలోని మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ సెంటర్ ఉద్యోగాలతో సమవేశమయ్యే అవకాశముంది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతారా లేదా అన్న విషయం పై పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా, ఈ నెల 30న ఢిల్లీలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగే రెండు కార్యక్రమాల్లో సత్య నాదెళ్ల పాల్గొననున్నారు.
గత ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్య నాదెళ్ల అనంతపురం జిల్లాలో జన్మించారు. బాల్యంతో పాటు పాఠశాల విద్యను హైదరాబాద్లో పూర్తిచేసుకున్న సత్య నాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసారు. అనంతరం అమెరికా పయనమైన సత్య నాదెళ్ల 1992 నుంచి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications