Just In
- 1 hr ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 18 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 20 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 23 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- News
Crime News: కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్థినిలు..
- Sports
శుభ్మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి గాయత్రి ప్లాన్.. చివరి నిమిషంలో మాట మార్చిన నందూ
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Finance
Free Flight Tickets: ఉచితంగా 5 లక్షల విమాన టిక్కెట్లు.. మీకూ వెళ్లాలనుందా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రద్దు దిశగా మొబైల్ నంబర్ పోర్టబులిటీ, యూజర్లకు కష్టాలు తప్పవు !
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మొబైల్ యూజర్లకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అనేది ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు. టెలికాం ఆపరేటర్ మారినా.. నంబర్ మారకుండా ఉండేదుకు దీని ద్వారా ఇతర నెట్ వర్క్ లకు వెళ్లేందుకు దీని ద్వారా అవకాశం కలుగుతుంది. అయితే మొబైల్ నంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఓ టెలీకం కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మారడం ఇకపై అంత సులభంగా జరిగే సూచనలు కనిపించడంలేదు. మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్పీ) సేవలు అందిస్తున్న రెండు కంపెనీలు వచ్చే ఏడాది నుంచి తమ సేవలు నిలిపివేస్తామని ప్రకంటిచినట్లుగా తెలుస్తోంది.

ఎకనమిక్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం..
ఎకనమిక్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.. ఈ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సేవలు అందించే ఎంఎన్పీ ఇంటర్కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కు ఓ లేఖ రాశాయి.

పోర్టింగ్ ఫీజు
పోర్టింగ్ ఫీజును భారీగా తగ్గించడం వల్ల ఇక తాము సేవలను కొనసాగించడం కుదరదని ఆ సంస్థలు స్పష్టంచేశాయి. కాగా మనదేశంలో ఇంటర్ కనెక్షన్ టెలీకం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఎమ్ఎన్పీ సేవలు అందిస్తున్నాయి.

రూ.19 నుంచి రూ.4 వరకు
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎమ్ఎన్పీ ఫీజులను రూ.19 నుంచి రూ.4 వరకు 80 శాతం మేర తగ్గించింది. దీనివల్ల తాము ప్రతిరోజూ నష్టాలను ఎదుర్కోవలసి వస్తోందని... వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ లైసెన్స్ ముగియగానే ఎంఎన్పీ సేవలు నిలిపివేస్తామని ఈ రెండు కంపెనీలు చెబుతున్నాయి.

అన్నట్టుగానే సేవలు నిలిపివేస్తే..
ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సేవలు నిలిపివేస్తే... వినియోగదారులు తమకు సిగ్నల్ సరిగా రావడం లేదనీ, ఫోన్బిల్ భరించలేకపోతున్నామని చెబుతూ వేరే కంపెనీలకు మారడం అంత సులువు కాదు.

గడువులోగా..
ఒకవేళ గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వం ఎంఎన్పీ కంపెనీలను మార్చే అవకాశం ఉందని కూడా టెలికం అధికారి పేర్కొన్నారు.

దేశంలో 117 కోట్ల మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్స్
ప్రస్తుతం దేశంలో 117 కోట్ల మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నట్లు ట్రాయ్ వెల్లడించింది. కొత్త కనెక్షన్ల విషయంలో నెలవారీగా 2.24 శాతం వృద్ధి రేటు కనిపించడం విశేషం. అంటే దాదాపు దేశ జనాభాలో 92.84 శాతం మంది మొబైల్ కనెక్షన్లు కలిగి ఉన్నారు.

ఎంఎన్పీ విధానం
వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు, కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం ఎంఎన్పీ విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

జియో దెబ్బ
జియో రంగప్రవేశం, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్సెల్, టెలీనార్ ఇండియా తదితర కంపెనీలు మూతపడడంతో నెలవారీ ఎంఎన్పీ రిక్వెస్టుల సంఖ్య ఇటీవల మూడు రెట్లకు పైగా పెరిగింది.

వినియోగదారులను నిలుపుకునేందుకు..
దేశంలో చాలా కాలం నుంచి ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్ తదితర కంపెనీలు తమ వినియోగదారులను నిలుపుకునేందుకు టారిఫ్లు భారీగా తగ్గిస్తున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470