అమెజాన్లో రూ.10 లక్షల మొబైల్ ఫోన్ల చోరీ, ఇంటి దొంగల పనే
అమెజాన్లో రూ. 10.37 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు థానేలోని పద్గా పోలీసులు వెల్లడించారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్లితే... మహారాష్ట్రాలోని థానే జిల్లా పరిథిలోని కురుంద్ గ్రామంలో అమెజాన్ గూడౌన్ ఉంది.

ఈ స్టోర్ హౌస్ లో ఇటీవల రూ.10.37 లక్షలు విలువైన మొబైల్ ఫోన్లు చోరికి గురైనట్లు అమెజాన్ గుర్తించింది. ఈ చోరీ ఘటనకు సంబంధించి మే 22వ తేదీన పద్గా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఇన్స్స్పెక్టర్ జయప్రకాష్ నేతృత్వంలోని పోలీస్ బృందం ఈ ఘటన పై విచారణ నిర్వహించి గూడౌన్లో పనిచేసే ఐదుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారించింది. వీరికి చోరీతో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
Read More : అదనపు ఫీజులు లేవ్, ఈ ఫోన్ల పై EMI చెల్లిస్తే చాలు

గతంలోనూ అమెజాన్లో చోరీలు
అమెజాన్ సంస్థకు చెందిన భివాండీ వేర్హౌస్ (గిడ్డింగి)లో చోటు చేసుకున్న ఓ భారీ దొంగతనం గతంలో కలకలపం రేపింది.

గతంలోనూ అమెజాన్లో చోరీలు
వేర్హౌస్లో పనిచేసే ఉద్యోగే ఈ హైటెక్ కుంభకోణానికి సూత్రదారి అని తేలింది. ఈ ఘటన పై దర్యాప్తు నిర్వహించిన వితల్వాడీ పోలీసులు ఉల్హాస్నగర్లో నిందితుడిని అరెస్ట్ చేసారు.

గతంలోనూ అమెజాన్లో చోరీలు
అమెజాన్ వేర్హౌస్లోని ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రమోద్ బాంబ్లీ (21) ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ రేట్లలో విక్రయిస్తున్నట్లు వితల్వాడీ పోలీసులకు ఫిర్యాదు అందింది.

గతంలోనూ అమెజాన్లో చోరీలు
రంగంలోకి దిగిన పోలీసులు ఉల్హాస్నగర్లోని బాంబ్లీ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.8.31 లక్షలు విలువ చేసే ఐఫోన్లు, ఐప్యాడ్లు, టాబ్లెట్ పీసీలు, వాచీలు దొరికాయి.

గతంలోనూ అమెజాన్లో చోరీలు
ర్హౌస్ నుంచి వస్తువులను బయటకు చేరేవేసే క్రమంలో తరచూ వేరొకరి పేరు మీద ప్రెజర్ కుక్కర్లను బాంబ్లీ బక్ చేసేవాడు.

గతంలోనూ అమెజాన్లో చోరీలు
ఆ ప్రెజర్ కుక్కర్లో ఎవరికి అనుమానం రాకుండా విలువలైన ఎలక్ట్రానిక్ వస్తువులను నింపి డెలివరీకి సిద్దం చేసేవాడు.


Click it and Unblock the Notifications








