ముకేశ్ అంబానీ మరో సంచలనం...? రూ.4000 ల కే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్..?
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ టెలికాం వైర్లెస్ నెట్వర్క్ సేవల్లో సంచలనం చేసినట్లుగానే దేశంలోని స్మార్ట్ఫోన్ పరిశ్రమను కూడా తన కొత్త ఆలోచనలతో మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. టెలికాం పరిశ్రమలో అతని ధరల దూకుడు మరియు అసాధారణ ప్రణాళికలు అతన్ని ఆధిపత్య శక్తిగా మార్చాయి.ఇలాంటి తరుణం లో దేశంలో స్మార్ట్ ఫోన్ పరిశ్రమపై అతడి ఆలోచనలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

రెండేళ్ళలో 200 మిలియన్ల స్మార్ట్ఫోన్లను
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలో ని స్మార్ట్ ఫోన్ ల తయారీ దారుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని స్థానిక సరఫరాదారులను కోరింది. తద్వారా వారు రాబోయే రెండేళ్ళలో 200 మిలియన్ల స్మార్ట్ఫోన్లను తయారు చేయగలరని అంచనా.ఈ విషయం దెస ఆర్థిక వ్యవస్థకు మరియు ఉదపాదక రంగానికి మంచిదే .కానీ, షియోమి వంటి ప్రత్యర్థి సంస్థలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

ధర 4,000 రూపాయలు ($ 54) తక్కువ ధర తో
భారతదేశం యొక్క అత్యంత విలువైన సంస్థ అయిన జియో గూగుల్ యొక్క ఆండ్రాయిడ్లో నడుస్తున్న ఫోన్లను తక్కువ ధరకే అందించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.మరియు దీనికి సంబంధించి ధర 4,000 రూపాయలు ($ 54) తక్కువ ధర తో ఆండ్రాయిడ్ తో నడిచే స్మార్ట్ఫోన్ ను రూపొందించడానికి దేశీయ సమీకరణదారులతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రణాళికలు అన్ని వ్యాపార రహస్యాలు కావడం వల్ల ప్రజలలో వీటిపై ఇంకా అవగాహన లేదు.ఈ చవకైన ఫోన్లను మాతృ సంస్థ క్యారియర్ అయిన రిలయన్స్ జియో నుండి తక్కువ ఖర్చు వైర్లెస్ ప్లాన్లతో విక్రయిస్తారని సమాచారం.డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా, లావా ఇంటర్నేషనల్ మరియు కార్బన్ మొబైల్స్ వంటి స్థానిక సంస్థలతో కలిసి పనిచేస్తారని ఆశించవచ్చు.
కానీ దీనిపై , రిలయన్స్ ప్రతినిధులు అధికారికంగా స్పందించడానికి నిరాకరించారు.

150 మిలియన్ల నుండి 200 మిలియన్ల ఫోన్లను విక్రయించాలనే రిలయన్స్ లక్ష్యం
రానున్న రెండు సంవత్సరాలలో 150 మిలియన్ల నుండి 200 మిలియన్ల ఫోన్లను విక్రయించాలనే రిలయన్స్ లక్ష్యం, స్థానిక కర్మాగారాలకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మార్చితో ముగిసిన ఈ సంవత్సరంలో భారతదేశం 165 మిలియన్ల స్మార్ట్ఫోన్లను అసెంబ్లీ చేయబడ్డాయి. మరియు సమాన సంఖ్యలో ప్రాథమిక ఫీచర్ ఫోన్లను మోహింద్రూ అసోసియేషన్ తెలిపింది.

పెట్టుబడులు
గత త్రైమాసికం లో రిలయన్స్ గూగుల్తో విస్తృత సంబంధాన్ని కుదుర్చుకుంది. దీనిలో ఆల్ఫాబెట్ ఇంక్ యూనిట్ 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి సాంకేతిక కార్యక్రమాలకు సహకరిస్తుంది. ఈ భాగస్వామ్యం ఇప్పటికీ నియంత్రణ సమీక్షలో ఉంది కాబట్టి రిలయన్స్ మొబైల్ ఫోన్ చొరవతో సొంతంగా ముందుకు సాగవచ్చు.జియో ప్లాట్ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఫేస్బుక్ ఇంక్ వంటి యు.ఎస్. దిగ్గజాల నుండి అంబానీ 20 బిలియన్ల డాలర్ కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టారు.


Click it and Unblock the Notifications








