Just In
- 2 hrs ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 5 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 6 hrs ago 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 9 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Don't Miss
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ముఖేష్ అంబానీ భవంతి స్థలం ముస్లిం వక్ఫ్బోర్డుది
అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ స్థలాన్ని కుర్రిమ్బాయ్ ఇబ్రాహీం ఖోజా ఆర్ఫనేజ్ ట్రస్టు నుంచి 2002లో 4.88 మిలియన్ డాలర్లు (రూ.21,50,00,000)కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ డీల్ను ముంబయి ఛారిటీ కమిషనర్ కూడా ఆమోదించారు. అయితే ఈ స్థలాన్ని బదిలీ చేసుకునేందుకు ముఖేష్ అంబానీ మహారాష్ట్ర స్టేట్ వక్ఫ్బోర్డు అనుమతి తీసుకోలేదు. ఇస్లాం చట్ట ప్రకారం వక్ఫ్ ఆస్తులన్నీ... ముస్లిం మతానికి సంబంధించిన కార్యకలాపాల కోసం కానీ... లేదా దానధర్మసంస్థల కోసం వాటని ప్రత్యేకంగా కేటాయించి పెడతారు.ముఖేష్ అంబాని ఇంటిపై వస్తున్న వివావాలపై వ్యాఖ్యానించేం దుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి నిరాకరించారు.
ఇది వారి వ్యక్తిగత వ్యవహారమని, దీనికి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ వివాదంపై వ్యాఖ్యానించేందుకు అంబానీ కూడా అందుబాటులో లేరు. మహారాష్ట్ర స్టేట్ వక్ఫ్బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ డీ పఠాన్ మాట్లాడుతూ. ముఖేష్ అంబానీ నిర్మించిన 27 అంతస్తుల భవనం స్థలం వాస్తవానికి వక్ఫ్బోర్డుదని..ఈ స్థలాన్ని వక్ఫ్ బోర్డుకిచ్చి అనాధ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించేందుకు ఈ స్థలాన్ని వాడాలని కోరామని చెప్పారు. కొంత మంది ట్రస్టు సభ్యులు చారిటీ కమిషనర్ను నుంచి అనుమతి తీసుకుని ముఖేష్ అంబానికి విక్రయించారని తెలుస్తోంది. అయితే వక్ఫ్బోర్డు అంబానీ నుంచి స్థలాన్ని వెనక్కు తీసుకోవాలనుకుంది. దీంతో అంబానీ బొంబాయి హైకోర్టుకు వెళ్లి స్టే తెచుకున్నారని పఠాన్ చెప్పారు. తమ స్థలాన్ని తమకు ఇప్పించమని... ఈ స్థలం బదిలీయే అక్రమమని వక్ఫ్బోర్డు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టులో కేసు విచారణలో ఉంది కాబట్టి తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చేతులెత్తేసిందని పఠాన్ చెప్పారు. ప్రస్తుతం ఈకేసు హైకోర్టులో పెండింగ్లో ఉందని ఆయన అన్నారు. మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి, వక్ఫ్ మంత్రి మహ్మద్ అరిఫ్ నసీం ఖాన్ మాట్లాడుతూ... ఈ విషయాన్ని సీబీఐకి అప్పగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అయితే కొన్ని వార్తా పత్రికల కథనాల ప్రకారం రాష్ట్రప్రభుత్వం ఈ భూ వివాదంలో సీబీఐ విచారణకు నిరాకరించినట్లు తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా విచారణ మొదలు పెట్టినా... పెట్టకపోయినా ఒక్కటి మాత్రం నిజం ముఖేష్ అంబానీ ఎంతో ముచ్చటపడి కట్టుకున్న కలలసౌధం పలు విమర్శలకు గురికావడం తథ్యం. ఈ భవనాన్ని 2010లో పూర్తి చేశారు. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి బీలియన్డాలర్ హోమ్గా చరిత్రలో మిగిలిపోతుంది. ముంబయిలో బాగా విస్తరించిన మురికి వాడల ప్రాంతంలో ముఖేష్ 27అంతస్తుల అత్యాధునిక భవంతిని నిర్మించారు. ఈ భవనంలో ఒక సినిమాహాలు... ఒక హెలీప్యాడ్, హెల్త్క్లబ్, స్విమ్మింగ్పూల్ ఉన్నాయి. ఈ భవంతి నెల విద్యుత్ బిల్లు రూ.75,00,000 పై మాటే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470