Home
News

దీపావళికి బంపర్ డీల్స్, ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

ఫెస్టివల్ సమయంలో ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం భారీ లాభాలతో పుంజుకుంటుదనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఈ కామర్స్ దిగ్గజాలు ఈ సమయంలోనే భారీ ఆఫర్లకు తెరలేపి తమ అమ్మకాలను మరింతగా పెంచుకుంటాయి. అయితే ఈ సారి వాటి

ఫెస్టివల్ సమయంలో ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం భారీ లాభాలతో పుంజుకుంటుదనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఈ కామర్స్ దిగ్గజాలు ఈ సమయంలోనే భారీ ఆఫర్లకు తెరలేపి తమ అమ్మకాలను మరింతగా పెంచుకుంటాయి. అయితే ఈ సారి వాటికి ముఖేష్ అంబానీ రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. Mukesh Ambani-led Reliance Industries (RIL) దీపావళి నాటికి ఈ కామర్స్ రంగంలోకి దూసుకురానుంది.

దీపావళికి బంపర్ డీల్స్, ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

RIL దీపావళి రోజున ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా నిలిచాయి. ఇదే జరిగితే ఇక ఈ కామర్స్ దిగ్గజాలు కూడా రిల్ దెబ్బకు అతలాకుతలం కాక తప్పదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఫ్లిప్ కార్ట్

ఫ్లిప్ కార్ట్

వాల్ మార్ట్ భాగస్వామి ఫ్లిప్ కార్ట్ Big Billion Day అని , మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ Great Indian Diwali Sale అని పండగ సమయాల్లో వినియోగదారులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఈ రెండు దిగ్గజాలకు ముఖేష్ అంబానీతో పెద్ద ఫైటే నడవనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రీటెయిల్స్ కు, ప్రొడ్యూసర్ కు

రీటెయిల్స్ కు, ప్రొడ్యూసర్ కు

రిలయన్స్ అతి త్వరలోనే ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టబోతోందని జియో అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం ద్వారా వినియోగదారులకు, రీటెయిల్స్ కు, ప్రొడ్యూసర్ కు అనేక రకాలైన ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం ద్వారా దేశంలో ఉన్న 3 కోట్ల మంది చిన్న వ్యాపారులకు మేలు జరగనుందని ఆయన తెలిపారు.

మొత్తం లక్ష మంది యాక్టివ్ బిజినెస్ పార్టనర్స్

మొత్తం లక్ష మంది యాక్టివ్ బిజినెస్ పార్టనర్స్

రిలయన్స్ జియోకు బెంగాల్ లో మొత్తం లక్ష మంది యాక్టివ్ బిజినెస్ పార్టనర్స్ ఉన్నారని, అయితే దీన్ని మరింతగా విస్తరిస్తామని ఆయన తెలిపారు. బెంగాల్ లో ఉన్న ప్రతి చిన్న గ్రామానికి కూడా జియో సేవలు అందే విధంగా కంపెనీ ముందుకువెళుతోందని తెలిపారు

రూ. 28 వేల కోట్ల పెట్టుబడులు

రూ. 28 వేల కోట్ల పెట్టుబడులు

ఇండియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానికి చెందిన రిల్ వెస్డ్ బెంగాల్లో ఇప్పటికే రూ. 28 వేల కోట్ల పెట్టుబడులను పెట్టింది. ఇండియాలో ఇలా పెట్టుబ పెట్టిన కంపెనీల్లో జియో పదవది. డిజిటల్ రివల్యూషన్ లో భాగంగా రూ.10 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు జియో ప్లాన్ చేస్తోంది.

డిజిటల్‌ కూపన్లను

డిజిటల్‌ కూపన్లను

జియో మనీ ప్లాట్‌ఫామ్‌ లేదా టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా డిజిటల్‌ కూపన్లను వాడుకుని పక్కనే ఉన్న దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేలా ఆపరేషనల్‌ మోడల్‌ను సిద్ధంచేస్తుందని తెలిసింది. ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌ సిటీల్లో పలు స్టోర్లకు, దిగ్గజ బ్రాండులకు కల్పిస్తోంది. వచ్చే ఏడాది దేశమంతటా దీన్ని ఆవిష్కరించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి

ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి

ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి

కాగా రిలయన్స్ జియో తనకున్న విస్తారమైన నెట్‌వర్క్‌, మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ వీధుల్లో ఉండే స్టోర్లు లేదా కిరణా షాపులతో కలిసి పనిచేస్తుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Mukesh Ambani to make e-commerce debut during Diwali's bumper deal frenzy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X