ధనలక్ష్మీ బ్యాంక్లో 1% వాటా కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్
oi
-Staff
By Super
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సహవ్యవస్థాపకుడు, యూఐఏడీఐ చైర్మన్ నందన్ నిలేకని ధనలక్ష్మీ బ్యాంక్లో 1%కు పైగా వాటా కొనుగోలు చేశారు. కేరళకు చెందిన ఈ బ్యాంక్లో ఆయన 1.17% వాటాకు సమానమైన 9,93,827 షేర్లను సొంతం చేసుకున్నారు.
ఈ వాటాను ఆయన జనవరి-మార్చి’11 కాలంలో కొనుగోలు చేశారు. మార్చి క్వార్టర్కు సంబంధించి ధనలక్ష్మీ బ్యాంకులో వాటాదారుల వివరాలను బీఎస్ఈ తాజాగా వెల్లడించింది. నీలేకని కుటుంబానికి ఇన్ఫోసిస్లో ప్రస్తుతం 3.44% వాటా ఉంది.