బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు కొత్త ఆఫర్లు!

హైదరాబాద్: రాష్ట్రంలోని తమ వినియోగదారులకు కొత్త టారిఫ్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రకటించింది. జూన్ నెలకు వర్తించే విధంగా రూ.220 ప్రీపెయిడ్ కస్టమర్లకు ఫుల్ టాక్టైమ్ ఆఫర్ సహా న్యూ రోమ్ ఫ్రీ ప్లాన్, ప్లాన్ కంటిన్యూషన్ ఓచర్ వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. ప్రీపెయిడ్ కస్టమర్లకు 2జీ లేదా 3జీ కాంబో ప్యాక్ స్పెషల్ టారిఫ్ ఓచర్స్ ఆఫర్ కూడా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ప్రయోజనాల్లో ఒకటి. పోస్ట్పెయిడ్ డేటా ప్లాన్స్కు సంబంధించి యూసేజ్ చార్జీలను తగ్గిస్తున్నట్లు కూడా ప్రకటన వెల్లడించింది.
బీఎస్ఎన్ఎల్ రూపొందించిన టాబ్లెట్ కంప్యూటర్ ‘పెంటా టీ-ప్యాడ్ WS802C’ కంప్యూటర్ ఫీచర్లు:
8 అంగుళాల టచ్స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2 జిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఫ్రంట్ కెమెరా, 4జీబి ఫ్లాష్ మెమెరీ,
512 ఎంబీ ర్యామ్,
32జీబి ఎక్సటర్నల్ స్టోరేజ్,
యూఎస్బీ,
వై-ఫై (802.11 b/g), బ్లూటూత్,
జీపీఆర్ఎస్,
హెచ్డిఎమ్ఐ అవుట్,
సిమ్ కార్ట్ స్లాట్,
ఆడియో ప్లేయర్,
వీడియో ప్లేయర్,
స్పీకర్స్,
ఆడియో జాక్,
స్టాండర్డ్ లితియమ్ పాలీమర్ 3000mAh బ్యాటరీ,
ప్రకటించిన నెల మార్చి 2012,
ధర రూ.13,500.


Click it and Unblock the Notifications








