Just In
- 6 hrs ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 9 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 10 hrs ago 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 13 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Don't Miss
- Sports DC vs SRH: సిక్సర్ల సునామీ.. హెల్మెట్లతో బాల్ బాయ్స్!వైరల్
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మొబైల్ కనెక్షన్ 90 రోజులకు మించి ఇవ్వొద్దు!
దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తున్న విదేశీ పర్యాటకులకు మొబైల్ కనెక్షన్ మూడు నెలలకు మించి ఇవ్వరాదని ప్రభుత్వం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. విదేశీ పర్యాటకుల ముసుగులో పలు సంఘవిద్రోహ శక్తులు సిమ్ కార్డులను సేకరించి చట్టువిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ టూరిస్టులకు కొత్త మొబైల్ కనెక్షన్లు జారీ చేసే సమయంలో ఈ ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. ప్రధానంగా.. సదురు విదేశీ పర్యాటకుని గుర్తింపు కార్డుతో పాటు చెల్లుబాటు వీసాతో కూడిన పాస్పోర్ట్ పత్రాలను తప్పనిసరిగా సేకరించాల్సి ఉంది. ఈ పత్రాలు సక్రమమైనవని నిర్ధారణకు వచ్చిన తరువాతే కొత్త కనెక్షన్ మంజూరు చేయాలని టెలికాం ఆపరేటర్లకు కేంద్రం స్పష్టం చేసింది.
నకిలీ పత్రాలతో మొబైల్ సిమ్కార్డ్ తీసుకుంటే కఠిన చర్యలే!
నకిలీ పత్రాలతో మొబైల్ సిమ్ కార్డులు తీసుకునే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. రిటైల్ మొబైల్ షాపులు, ఫ్రాంచైజీలకు ఫోర్జరీ పత్రాలను సమర్పించి సిమ్లు కొనుగోలు చేస్తే ఇకపై పోలీసు కేసు నమోదుకానుంది. కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి పరిశీలనపై టెలికం విభాగం(డాట్) విడుదల చేసిన తాజా నిబంధనల్లో ఈ అంశాన్ని చేర్చారు. దీని ప్రకారం… ఎవరైనా మొబైల్ కస్టమర్ సిమ్ల కోసం నకిలీ ధ్రువపత్రాలను ఇవ్వడం, ఒరిజినల్స్ కూడా నకిలీవే అయిన పక్షంలో ఆయా రిటైలర్లు/ఫ్రాంచైజీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఎఫ్ఐఆర్ను నమోదుచేసేలా చూడాలని డాట్ ఆదేశించింది. దీంతోపాటు సంబంధిత టెలికం ఆపరేటర్ దృష్టికి ఈ విషయాన్ని 15 రోజుల్లోగా తెలియజేయాలని కూడా పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ రెండో వారం నుంచి అమల్లోకి రానున్నాయి.
నిబంధనలు ఇవీ…
సిమ్ కార్డులు విక్రయించే అధీకృత వ్యక్తి… కస్టమర్ దరఖాస్తుతో పాటు ఇచ్చిన ఫోటోను సరిపోల్చిచూసినట్లు తెలియజేయాలి. అదేవిధంగా సిమ్ ఎవరిపేరుపై తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని చూసినట్లు కూడా దరఖాస్తులో పేర్కొనాలి.
సిమ్ కోసం సమర్పించిన డాక్యుమెంట్లల్లో అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్స్ను కూడా పరిశీలించినట్లు సంబంధిత దరఖాస్తుపై రిటైలర్ సంతకం కూడా చేయాలి.
ఫోర్జరీ పత్రాలు ఇచ్చిన వారిపై రిటైలర్/ఫ్రాంచైజీలు గనుక ఫిర్యాదు/ఎఫ్ఐఆర్ను దాఖలు చేయకపోతే… సంబంధిత మొబైల్ ఆపరేటర్ స్పందించాల్సి ఉంటుంది. సబ్స్క్రయిబర్తో పాటు రిటైలర్/ఫ్రాంచైజీలపై మూడురోజుల్లోగా ఆపరేటరే పోలీసులకు ఫిర్యాదు లేదా
ఎఫ్ఐఆర్ను నమోదు చేయించాలి.
ఒకవేళ ఫోర్జరీ డాక్యుమెంట్ల విషయంలో అమ్మకందారు, కస్టమర్లపై చర్యలు చేపట్టకపోతే టెలికం ఆపరేటర్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఒక వ్యక్తి ఒక టెలికం సర్కిల్లో బల్క్ కనెక్షన్లు తీసుకోవడాన్ని కూడా ఇక నిషేధించనున్నారు. 10కి మించి మొబైల్ కనెక్షన్లను(మొత్తం ఆపరేటర్లందరి నుంచీ) పొందే వీలుండదు.
బల్క్ కనెక్షన్లను యాక్టివేట్ చేసేటప్పుడు కూడా ఆ సబ్స్క్రయిబర్ వివరాలను, నివాసాన్ని తప్పనిసరిగా పరిశీలించాల్సిందే. అంతేకాకుండా ప్రతి 6 నెలలకూ ఒకసారి రీ-చెక్ చేసుకోవాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470