వొడాఫోన్ కస్టమర్లకు దీపావళి బంపర్ ఆఫర్
దీపావళిని పురస్కరించుకుని వొడాఫోన్ ఇండియా దక్షిన భారతదేంలోని తన ప్రీ-పెయిడ్ ఖాతాదారుల కోసం ‘వన్ రేట్, వన్ సౌత్' పేరుతో సరికొత్త ఆఫర్ ప్యాక్ను విడుదల చేసింది. ఈ ప్యాక్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక యూజర్లకు ఏ విధమైన రోమింగ్ ఇన్కమింగ్ ఛార్జీలు ఉండవు.

Read More : స్మార్ట్ఫోన్ కవర్స్ పై భారీ డిస్కౌంట్, త్వరపడండి
ఈ ఆఫర్ పథకానికి యాక్టివేట్ కావటం వల్ల అన్ని అవుట్ గోయింగ్ మొబైల్ కాల్స్ (లోకల్, ఎస్డీడీ, రోమింగ్) పై సెకనుకు పైసా మాత్రమే వొడాఫోన్ చార్జ్ చేస్తుంది. ఈ ఆఫర్ అమలులో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఎక్కడినుంచైనా వినియోగదారుడు రోమింగ్ ఇన్ కమింగ్ చార్జీలు లేకుండా మాట్లాడుకోవచ్చు. దక్షిణ భారతదేశంలోని అన్ని వొడాఫోన్ ఎక్స్క్లూజివ్ స్టోర్లలో ‘వన్ రేట్, వన్ సౌత్' ప్యాక్ అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








