జియో తర్వాత ముఖేష్ అంబాని మాస్టర్ ప్లాన్ !
అంబాని జియోతోనే ఆగిపోనున్నారా..ఆయన భవిష్యత్ వ్యూహాం ఏంటీ..ఎటువంటి మాస్టర్ ప్లాన్ కి తెరలేపబోతున్నారు..?
ఇప్పుడు దేశం మొత్తాన్ని ఊపేస్తున్న ఫీవర్ ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియో మాత్రమే. దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు జియో గురించే చర్చ నడుస్తోంది. జియో ఉచిత ఆపర్లు దిగ్గజ టెల్కోలను ఒక్కసారిగా నష్టాల బాటలోకి నడిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అంబాని జియోతోనే ఆగిపోనున్నారా..ఆయన భవిష్యత్ వ్యూహాం ఏంటీ..డిజిటల్ ఇండియా కోసం ఎటువంటి మాస్టర్ ప్లాన్ కి తెరలేపబోతున్నారనే అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
బిగ్ ఆయిల్,బిగ్ డేటా..జియో ఇన్సైడ్ నిజాలు

స్మార్ట్ఫోన్ కంపెనీలకు సవాల్
ముఖేష్ అంబాని స్మార్ట్ఫోన్ కంపెనీలకు సవాల్ విసరనున్నాడు. అత్యంత తక్కువ ధరలో కేవలం రూ. 1000 లకే 4జీ సూపర్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనున్నాడు. తద్వారా కంపెనీలకు భారీగా గండిపడనుంది.

పర్యావరణంపై దృష్టి
పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని విధంగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని రూపొందించనున్నట్లు సమాచారం.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో పైబర్
దేశం మొత్తం జియో పైబర్ సేవలు అందనున్నాయి. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పైబర్ వైర్లు వేస్తున్నారు. ఇవి 5జీని కూడా అందుకునే విధంగా ఉంటాయని సమాచారం. అంటే మిగతా టెల్కోలకు గడ్డుకాలమే.

డిజిటల్ మయం
గృహోపకరణ వస్తువులతో కమ్యూనికేట్ అయ్యే విధంగా సరికొత్త ఉత్పత్తులను తీసుకురానున్నారు. అంతా డిజిటల్ మయం చేయనున్నారు.

సరికొత్త యాప్స్
ఎంటర్ టైన్ మెంట్ నుండి హెల్త్ సర్వీసు రంగాల వరకు 360 డిగ్రీల వినియోగంతో సరికొత్త యాప్స్ క్రియేట్ చేయనున్నారు. అంటే ఆ రంగాల మొత్తం సమాచారాన్ని యాప్స్ లో ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








