ఒక్క సీపీయూ... 256 కంప్యూటర్లు!

హైదరాబాద్: అధిక సంఖ్యలో కంప్యూటర్లు వాడే చోట కేవలం ఒక్క సీపీయూతో మిగిలిన అన్ని కంప్యూటర్లను అనుసంధానించే కొత్త పరికరాన్ని రిమోట్ డెస్క్టాప్ ప్రొటోకాల్ (ఆర్డిపీ) సంస్థ ఆవిష్కరించింది. సోమవారం ఇక్కడ ‘థిన్ క్లైంట్ ఏడబ్ల్యూ -100’ అనే పరికరాన్ని ఆర్డీపీ సంస్థ ఎండీ విక్రం.బి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటి కంటే అధిక కంప్యూటర్లు ఉపయోగించే కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి వాటిలో ఒక్క సీపీయూను పెట్టుకొని మిగిలిన వాటికి ఈ పరికరాన్ని అమర్చి ఉపయోగించుకోవచ్చన్నారు.
ఈ విధానంతో ఐపి అడ్రస్ల ద్వారా 256 కంప్యూటర్లను అనుసంధానించ వచ్చని వారు తెలిపారు. అరచేతి మందం ఉండే ఈ పరికరాన్ని డెస్క్టాప్ వెనుకభాగంలో బిగించవచ్చని, దీంతో ఎంతో స్థలం ఆదా అవడమే కాక, విద్యుత్ వినియోగాన్ని కూడా 90 శాతం మేర తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. సిపీయూ ధరలో సగం రేటుకే ఇది లభిస్తుందని వారు తెలిపారు.


Click it and Unblock the Notifications








