రైల్వే శాఖ మరో ముందడుగు: ఆన్లైన్లో విశ్రాంతి గదుల బుకింగ్ సదుపాయం
రైలు ప్రయాణాలు చేసేవారు ఇక పై రైల్వే స్టేషన్లలోని విశ్రాంత గదులను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రధాన నగరాల్లో సహా 60 ప్రముఖ రైల్వే స్టేషన్లలోని విశ్రాంతి గదులను అన్లైన్ బుక్ చేసుకునే వ్యవస్థను కేంద్ర రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. అమృత్సర్, పాట్నా, జమ్ము, సిమ్లా, అహ్మదాబాద్ సహా మొత్తం 67 స్టేషన్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ సీనియర్ అధికారిక ఒకరకు మీడియాకు వెల్లడించారు.

ఇప్పటి వరకు ఇలా ఆన్లైన్ విధానం ద్వారా విశ్రాంతి గదులను బుక్ చేసుకునే సదుపాయం కేవలం ముంబయి, ఢిల్లీ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఈ ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా విశ్రాంత గదులు లేదా మంచాలను కనిష్టంగా 12 గంటల వరకు, గరిష్టంగా 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణీకులు తాము బయలుదేరే స్టేషన్లో, చేరుకోబోయే స్టేషన్లోనూ గదలను బక్ చేసుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








