మార్కెట్లోకి Oppo కొత్త స్మార్ట్ఫోన్లు
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo), రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను తైవాన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఫుల్ - స్ర్కీన్ డిజైన్తో వస్తోన్న ఈ రెండు స్మార్ట్ఫోన్ల ఒప్పో ఏ75, ఒప్పో ఏ75ఎస్ మోడల్స్లో అందుబాటులో ఉంటాయి.

ఈ రెండు ఫోన్లలో ఇంటర్నల్ స్టోరేజ్ తప్ప మిగలిన స్పెసిఫికేషన్లన్నీ ఒకేలా ఉంటాయి. తైవాన్ మార్కెట్లో ఒప్పో ఏ75 ధర 10,990 NTDగా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.23,500. ఒప్పో ఏ75ఎస్ మోడల్ ధర 11,990 NTDగా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.25,650గా ఉంటుంది.

ఒప్పో ఏ75, ఏ75ఎస్ స్పెసిిఫికేషన్స్..
6 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి2,160× 1,080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ హీలియో పీ23 (ఎమ్టీ6763టీ) ప్రాసెసర్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, బ్లుటూత్ 4.2 సపోర్ట్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్), ఫోన్ చుట్టుకొలత 156.5×76×7.5 మిల్లీ మీటర్లు, బరువు 152 గ్రాములు.


Click it and Unblock the Notifications








