ఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివో

|

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఒప్పో, షియోమి మరియు వివో సంస్థలు చాలా కాలంగా క్రాస్ బ్రాండ్ ఫైల్ షేరింగ్ సొల్యూషన్ కోసం కృషి చేస్తున్నారు. ఈ కొత్త ఫైల్ షేరింగ్ వ్యవస్థ Wi-Fi డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు కంపెనీలు తమ పీర్-టు-పీర్ ట్రాన్స్మిషన్ కూటమిని ప్రపంచ మార్కెట్‌కు విస్తరిస్తున్నాయి.

 

ఇంటర్నెట్ కనెక్షన్

ఒకవేళ ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే కనుక వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ఏవైనా ఫైళ్లను, ఫోటోలను మరియు వీడియోలను కూడా ఒకరి నుండి మరొకరు షేర్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీకి సంబందించిన లాంచ్ డేట్ మరియు టెక్నికల్ అంశాలను కంపెనీలు గత ఏడాది ప్రారంభంలో ప్రకటించాయి.

 

 

BSNL వసంతం ప్లాన్‌...తక్కువ ధర వద్ద అధిక ప్రయోజనాలుBSNL వసంతం ప్లాన్‌...తక్కువ ధర వద్ద అధిక ప్రయోజనాలు

స్మార్ట్‌ఫోన్‌

కొత్త ప్రకటనలో భాగంగా వివో సంస్థ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 2020 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ కొత్త టెక్నాలజీని విడుదల చేయనున్నట్లు వివో పేర్కొంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లుప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎయిర్ డ్రాప్ ప్రత్యామ్నాయ వివరాలు
 

ఎయిర్ డ్రాప్ ప్రత్యామ్నాయ వివరాలు

కొత్త ఫైల్ ట్రాన్సఫర్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని వివరాలను ఒప్పో సంస్థ వెల్లడించింది. ప్రకటనలో భాగంగా ఒప్పో వైస్ ప్రెసిడెంట్ ఆండీ వు ఒక ప్రకటనను విడుదల చేశారు. "ఈ మూడు-బ్రాండ్ల భాగస్వామ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది OPPO, వివో మరియు షియోమి వినియోగదారుల కోసం వినియోగదారు-కేంద్రీకృత ఫైల్-షేరింగ్‌ను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది" అని వు అన్నారు. OPPO, Vivo మరియు Xiaomi తమ వినియోగదారులకు సమిష్టిగా మంచి సేవలందించడానికి ఇది ఒక ముఖ్యమైన మొదటి అడుగు. అదనంగా ఒప్పో ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను కూడా కూటమిలోకి స్వాగతించింది.

 

 

గూగుల్ యాప్స్ లకు పోటీగా హువాయి యాప్స్గూగుల్ యాప్స్ లకు పోటీగా హువాయి యాప్స్

Wi-Fi P2P టెక్నాలజీ

Wi-Fi P2P టెక్నాలజీ

ఈ టెక్నాలజీ ద్వారా మీ యొక్క సమీప ప్రాంతంలో ఉన్న మరొక డివైస్ లను స్కాన్ చేయడానికి బ్లూటూత్ లో ఎనర్జీని ఉపయోగిస్తుంది. తరువాత బదిలీ కోసం Wi-Fi కి మారుతుంది. Wi-Fi P2P టెక్నాలజీ బ్లూటూత్ కంటే వేగంగా ఉంటుంది కాని డివైస్ యొక్క వాస్తవ Wi-Fi కనెక్టివిటీని ప్రభావితం చేయదు. దీని ద్వారా వినియోగదారులు సగటున 20Mbps ట్రాన్సఫర్ వేగాన్ని ఆశిస్తారు. ఒప్పో నుండి రాబోయే తన కలర్‌ఓఎస్ 7 లో భాగంగా ఈ టెక్నాలజీని అందిస్తుంది. యూజర్లు "ఒప్పో షేర్" బటన్‌ను కనుగొనడానికి డ్రాప్-డౌన్ మెనుని యాక్సెస్ చేయడానికి హోమ్ స్క్రీన్ నుండి క్రిందికి స్వైప్ చేయవచ్చు.

 

 

5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా

షియోమి

షియోమి లేదా వివో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు డివైస్ ను స్వీకరించడానికి లేదా పంపడానికి షేర్ బటన్‌ను నొక్కాలి. వినియోగదారులు ఒకేసారి అధిక ఫైళ్ళను పంపవచ్చని ఒప్పో స్పష్టం చేసింది. ఈ టెక్నాలజీ అన్ని ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7 అనుకూల స్మార్ట్‌ఫోన్ లలో లభిస్తుందని కంపెనీ గుర్తించింది. వీటిలో రెనో 2, రెనో 10 ఎక్స్ జూమ్, ఎఫ్ 11 ప్రో, ఎఫ్ 11 ప్రో మార్వెల్ యొక్క ఎవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్, ఎఫ్ 11, ఫైండ్ సిరీస్ డివైస్ లు ఉన్నాయి. అదనంగా ఒప్పో ఈ టెక్నాలజీని ఒప్పో కె 3 తో పాటు దాని R, F మరియు A సిరీస్‌లకు కూడా రోల్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Oppo,Xiaomi and Vivo in an Effort to Transfer Files without Internet

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X