పాన్ - ఆధార్ కార్డు లింక్, చివరి తేదీ ఈ రోజే! ఫైన్ ఎంత? వివరాలు
మీ పాన్ కార్డ్ని ఆధార్ నంబర్తో లింక్ చేయడానికి ఈరోజు (జూన్ 30) చివరి రోజు. మీరు ఈరోజు నిర్ణీత గడువులోగా పాన్ ఆధార్ను లింక్ చేయకుంటే, మీ పాన్ కార్డు ఇన్ ఆక్టివ్ గా మారుతుంది. పాన్ ఆధార్ కోసం ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్నందున. ప్రభుత్వం సూచనల ప్రకారం పాన్ కార్డు వినియోగదారులు ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరిగా మారింది.
అవును, ఆధార్ మరియు పాన్ కార్డు లింక్ కోసం కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఈ రోజు ముగిసేలోపు మీ పాన్ కార్డు ను ఆధార్తో లింక్ చేయండి. లేదంటే జూలై 1, 2023 నుండి ఎలాంటి నోటీసు లేకుండా మీ PAN డియాక్టివేట్ చేయబడుతుంది. అయితే ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు కోసం ఇచ్చిన గడువు ఎంత? దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

ఈ అర్ధరాత్రి లోపు మీ ఆధార్ పాన్ లింక్ చేయకుంటే, మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ చేయబడుతుంది. అందువల్ల, మీరు రాబోయే రోజుల్లో బ్యాంకు లావాదేవీలతో పాటు అనేక ఆర్థిక విషయాలలో ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఏప్రిల్ 2022 మరియు 30 జూన్ 2022 మధ్య లింక్ చేసేవారిని రూ. 500 జరిమానా చెల్లించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం, ఆధార్ మరియు పాన్ లింక్ చేసినందుకు రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఈరోజు నిర్ణీత గడువులోగా ఆధార్ పాన్ లింక్ చేయకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. బ్యాంకింగ్తో సహా ఇతర ఆర్థిక రంగంలో లావాదేవీలకు పాన్ కార్డు గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది. ఇదే కారణంతో పాన్ యూజర్లను వారి ఆధార్ నంబర్తో లింక్ చేయాలని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆదేశించడం గమనార్హం.
ఇంతకు ముందు ప్రకటనల ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్చి 2022లో ప్రచురించిన సర్క్యులర్లోని సమాచారం ప్రకారం, జూలై 1, 2017 నుండి పాన్ కేటాయించిన ప్రతి వ్యక్తి తమ ఆధార్ నంబర్ను వెల్లడించడాన్ని ఆదాయపు పన్ను చట్టం తప్పనిసరి చేసింది. అందుకే ఆధార్ మరియు పాన్ లింక్ చేయడం చాలా ముఖ్యం.
కొంత మందికి ఈ పాన్ ఆధార్ లింక్ తప్పనిసరి కాదు? వారెవరో చూడండి.
* ఎనభై ఏళ్లకు పైబడిన వారికి ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి కాదు.
* ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రవాస భారతీయులకు ఇది తప్పనిసరి కాదు.
* భారత పౌరులు కాని వారికి ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి కాదు.
పాన్ ఆధార్ లింక్ చేయకుంటే నష్టాలు ఏమిటి?
మీరు ఈరోజు పాన్ ఆధార్ను లింక్ చేయకపోతే, మీ పాన్ డియాక్టివేట్ చేయబడుతుంది. ఈ రకమైన పాన్ను ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయడం సాధ్యం కాదు. అలాగే పెండింగ్లో ఉన్న ఇన్కమ్ టాక్స్ రిటర్న్లు ప్రాసెస్ చేయబడవు. అలాగే, మీ PAN
డియాక్టివేట్ అయి ఉంటే, మీరు పన్ను చెల్లించేటప్పుడు మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు, మీ బ్యాంకు లావాదేవీలతో సహా ఆర్థిక లావాదేవీలు చేయడంలో మీకు ఇబ్బంది ఉంటుంది.
పాన్ను ఆధార్తో ఎలా లింక్ చేయాలి?
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ (http://www.incometax.gov.in.)లో ఆధార్ పాన్ లింక్ కోసం ఆప్షన్ ఇవ్వబడిబడింది. ఇప్పుడు పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ముందుగా SMS సర్వీస్ ద్వారా, మరియు రెండవది ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి వెళ్లి అక్కడ ఉన్న స్టెప్స్ ను ఎలా పాటించాలి వివరాలు ఇక్కడ చూడండి. లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications