పెట్రోల్, డీజిల్పై రూ. 7500 వరకు డిస్కౌంట్, పేటీఎం బంపరాఫర్ !
దేశీయ మార్కెట్లో రోజు రోజుకు పెట్రోలు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రోజు ఎంతో కొంత పెరుగుతూ వినియోగదారులకు చుక్కలను చూపిస్తున్నాయి.
దేశీయ మార్కెట్లో రోజు రోజుకు పెట్రోలు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రోజు ఎంతో కొంత పెరుగుతూ వినియోగదారులకు చుక్కలను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఓ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. అటు వినియోగదారులను మరింత ఆకర్షించడంతో పాటు, భారీగా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లకు ఊరట కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. పేటీఎం ద్వారా జరిపే పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై డిస్కౌంట్ స్కీంను, క్యాష్ బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది.

డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను..
పెట్రోల్, డీజిల్ కొనుగోలు చెల్లింపులపై రూ. 7500 దాకా డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనున్నట్టు వెల్లడించింది.

50 ట్రాన్సాక్షన్స్
పేటీఎం.కాం అందించిన సమాచారం ప్రకారం ఇందుకు కనీస లావాదేవీ 50 రూపాయిలుగా నిర్ణయించింది. వినియోగదారుడు ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది.

ఆగష్టు 1, 2019 వరకు
ఈ ఆఫర్ ఆగష్టు 1, 2019 వరకు చెల్లుతుంది. మొత్తం పూర్తయ్యేనాటికి మీకు రూ. 7500 క్యాష్ బ్యాక్ రూపంలో లభిస్తుంది.

మొదటి కనీస లావాదేవీ ముగిసిన అనంతరం..
పెట్రోల్ బంకు దగ్గర మొదటి కనీస లావాదేవీ ముగిసిన అనంతరం, వినియోగదారులకు రూ. 7500 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్' లో పాల్గొనమంటూ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది.

11, 21, 31, 41లావాదేవీల అనంతరం..
ఇందులో ఒక ప్రోమో కోడ్ను కూడా జత చేస్తుంది. దీని ద్వారా 11, 21, 31, 41లావాదేవీల అనంతరం క్యాష్బ్యాక్ ఆఫర్ ఇస్తుంది.

ప్రతీ 10వ లావాదేవీ అనంతరం..
అంటే ప్రతీ 10వ లావాదేవీ అనంతరం రూ.1350 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.7500 క్యాష్ బ్యాక్ ఆఫర్ను వినియోగదారులు పొందవచ్చు.

48 పనిగంటల లోపు..
లావాదేవీ ముగిసిన 48 పనిగంటల లోపు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఈ ప్రోమో కోడ్తో మాత్రమే వీటిని రిడీమ్ చేసుకోవచ్చు.

ముందు జరిగిన లావాదేవీకి మాత్రమే..
అలాగే ఒక వారంలో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినా ముందు జరిగిన లావాదేవీకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications








