Home
News

ఇండియాలో 6G ని లాంచ్ చేస్తాం ...! 6G గురించి ప్రధానమంత్రి మొదటి ప్రకటన.

By Maheswara

రాబోయే కొన్ని నెలల్లో కొత్త కమ్యూనికేషన్ నెట్‌వర్క్ 5G ప్రారంభం కానుండగా, ప్రస్తుతం భారతదేశంలో 5G చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సమయంలో, మన దేశం కూడా 6జీ సేవలకు సిద్ధమవుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్‌లో ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ట్విట్టర్‌లో ప్రకటించారు.

భారతదేశంలో దశాబ్దం చివరి నాటికి 6G సేవలు

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2022 గ్రాండ్ ఫినాలేలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ, దశాబ్దం చివరి నాటికి భారతదేశం 6Gని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. "మేము ఈ దశాబ్దం చివరి నాటికి 6Gని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ప్రభుత్వం గేమింగ్ మరియు వినోదంలో భారతీయ పరిష్కారాలను ప్రోత్సహిస్తోంది" అని ఆయన చెప్పారు.

6G సొల్యూషన్స్‌

6G సొల్యూషన్స్‌

దేశంలో 6G సొల్యూషన్స్‌కు సంబంధించి ఇది మొదటి అధికారిక ప్రకటన అవుతుంది. ప్రస్తుతం, 5G రోల్‌అవుట్ విషయానికి వస్తే భారతదేశం ఇంకా మొదటి దశ లో ఉంది. 5G రాబోయే నెలల్లో ఇండియా లో లాంచ్ చేయాలని భావిస్తున్నారు. అప్‌గ్రేడ్ చేసిన 6G అవస్థాపన సౌలభ్యంతో పాటు ఆర్థిక వృద్ధిని మరింత పెంచుతుంది.

భారతదేశంలో 5G రోల్‌అవుట్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.

భారతదేశంలో 5G రోల్‌అవుట్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.

మరోవైపు, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు కొత్తగా చేరిన అదానీ డేటా నెట్‌వర్క్‌లు వంటి ప్రైవేట్ టెలికాం ప్లేయర్‌లు 5G విస్తరణలో ప్రధాన పాత్రలు పోషిస్తాయి. భారతదేశంలో 5G రోల్ అవుట్ సెప్టెంబర్ 29 నాటికి ప్రారంభమవుతుందని మునుపటి ఊహాగానాలు సూచించాయి. అయితే, భారతదేశంలో 5G సేవలు అక్టోబర్ 12 నుండి ప్రారంభమవుతాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు.

వచ్చే రెండు-మూడేళ్లలో

వచ్చే రెండు-మూడేళ్లలో

వచ్చే రెండు-మూడేళ్లలో అన్ని ప్రధాన నగరాలు, కీలకమైన గ్రామీణ ప్రాంతాలకు 5జీ సేవలు అందుతాయని మంత్రి హామీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా, 5G ప్లాన్‌లు అందుబాటు ధరలోనే ఉంటాయి. మరియు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయని వైష్ణవ్ హామీ ఇచ్చారు. PTI నివేదిక ప్రకారం, 5G రోల్‌అవుట్ కోసం అన్ని చర్యలు క్రమపద్ధతిలో జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.

స్పెక్ట్రమ్ వేలం

స్పెక్ట్రమ్ వేలం

గత నెల జులై 26 అంటే మెగా 5G స్పెక్ట్రమ్ వేలం (రూ. 1.9 లక్షల కోట్లు) జరిగిన విషయం మీకు తెలిసిందే. భారతదేశంలో కొత్త 5G యుగానికి సిద్ధం కానున్నది. 5G నెట్‌వర్క్‌లు 4G కంటే 10 రెట్లు మరియు 3G కంటే 30 రెట్లు వేగంగా అందుబాటులో ఉండనున్నాయి. వేలంలో  టాప్ క్యారియర్‌లలో రిలయన్స్ జియో మొదటి స్థానంలో నిలిచింది.తర్వాత, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు ఉన్నాయి. ఎయిర్‌వేవ్‌లలోకి కొత్తగా ప్రవేశించిన అదానీ గ్రూప్ కూడా డేటా నెట్‌వర్క్‌ల కోసం కొన్ని 5G ఎయిర్‌వేవ్‌ల వేలంలో పాల్గొంది.

భారతదేశంలో 5G

భారతదేశంలో 5G

భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ యాక్షన్‌ త్వరలో తెరపైకి రానుంది. ఈ స్పెక్ట్రమ్ వేలం కోసం 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3306MHz వంటి వివిధ బ్యాండ్‌లలో ఎయిర్‌వేవ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎయిర్‌వేవ్‌లన్నీ భారతీయ టెల్కోలకు ఎంటర్‌ప్రైజెస్ లేదా మొబైల్ వినియోగదారుల కోసం నేరుగా వారి 5G కార్యకలాపాలతో సహాయం చేయబోతున్నాయి.

BSNL పోటీ పడగలదా?

BSNL పోటీ పడగలదా?

భారతదేశంలో 5G లాంచ్ ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మరియు అదానీ డేటా నెట్‌వర్క్‌లతో ప్రారంభమవుతుంది. 6G రోల్‌అవుట్‌కు ఈ టెల్కోలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రైవేట్ ప్లేయర్లు 5G లాంచ్ కోసం సన్నద్ధమవుతున్నప్పుడు, BSNL ఇప్పుడు 4G నెట్‌వర్క్ రోల్‌అవుట్‌పై పని చేస్తోంది. ఒక తరం వెనుకబడి ఉన్నందున, ప్రభుత్వ మద్దతు ఉన్న నెట్‌వర్క్ ప్రొవైడర్ 6G సేవలను మాత్రమే కాకుండా 5Gని అందించడానికి ఎక్కువ సమయం పడుతుందని గ్రహించవచ్చు.

Best Mobiles in India

English summary
PM Narendra Modi Announces 6G Service Plan In India. THings You Need To Know About 6G Technology.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X